Road Accident: యాదాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. వికారాబాద్ జిల్లా లక్ష్మీనారాయణపురం సమీపంలోని జాతీయ రహదారిపై కారులో పొగలు చెలరేగాయి. రేడియేటర్, సైలెన్సర్ నుంచి భారీగా పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే పొగను గమనించిన ప్రయాణికులు కారు దిగిపోయారు. తాండూరు నుంచి కొడంగల్ వెళ్తుండగా ఈ ఘటన జరిగిట్లు సమాచారం. వెంటనే స్థానికులు పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం.
మరోవైపు పల్నాడు జిల్లా అడిగొప్పలలో విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తు ఎర్రవాగులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నాగరాజు అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: రైల్వే స్టేషన్లో ఎగిసి పడుతున్న మంటలు.. 400 వాహనాలు దగ్ధం
డెడ్ బాడీని బయటకు తీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపడుతున్నారు.