Nampally: హైదరాబాద్లోని నాంపల్లి రైల్వే స్టేషన్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్లోని నాలుగో నెంబర్ ప్లాట్ఫామ్పై నిలిపి ఉంచిన ఒక రైలు ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు భారీగా వ్యాపించడంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్మేసింది. ఎప్పుడూ రద్దీగా ఉండే నాంపల్లి స్టేషన్లో ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు దక్కించుకోవడానికి అటుఇటు పరుగులు తీశారు.
సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. రైల్వే అధికారులు, పోలీసులు ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రమాద స్థలాన్ని అధీనంలోకి తీసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో రైల్వే స్టేషన్లో కాసేపు తీవ్ర గందరగోళం, ఉత్కంఠ నెలకొంది.
Also Read: విజయ్తో పోలిక.. వైసీపీకి ఇచ్చిపడేసిన పవన్.. ఏమన్నారంటే?
నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం
నాలుగో నెంబర్ ఫ్లాట్ ఫామ్పై ఉన్న ఏసీ కోచ్లో ఒక్కసారిగా చెలరేగిన మంటలు
మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది
ప్రమాద ఘటనతో ప్రయాణికుల భయాందోళన
Fire Breaks Out at Nampally Railway Station
Flames suddenly erupted in an AC coach located… pic.twitter.com/ty4Lq1Wnhs
— BIG TV Breaking News (@bigtvtelugu) May 15, 2026