E-Paper
Advertisement

Hyderabad Tragedy: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థి మృతి

Hyderabad Tragedy: ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. 8వ తరగతి విద్యార్థి మృతి

Hyderabad Tragedy: హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం చిన్నారి ప్రాణం తీసింది. అమీర్ పేట్ లోని సిస్టర్ నివేదిత స్కూల్ ట్రిప్ లో భాగంగా పిల్లలను వండర్ లా కి తీసుకెళ్లారు. అయితే వయసుకి మించి యాక్టివిటీస్, గేమ్ ఆడించడంతో 8వ తరగతి విద్యార్థి దమరుక్ సూర్యతేజ కింద పడి అపస్మార్క స్థితిలోకి వెళ్లాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స సూర్యతేజ మృతి చెందాడు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ మరణించాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మహారాష్ట్రలో మరో ఘటన

మహారాష్ట్రలోని జల్నాలో 13 ఏళ్ల 8వ తరగతి విద్యార్థిని పాఠశాల భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకి మరణించింది. విద్యార్థిని మరణానికి దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఓ పాఠశాలలో జరిగింది. బాలిక పాఠశాల భవనంలోని మూడో అంతస్తు నుంచి దూకింది. పాఠశాల యాజమాన్యం బాలిక తండ్రికి సమాచారం అందించారు. అతను వెంటనే పాఠశాలకు చేరుకున్నారు. బాలికను మొదట ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆపై జిల్లా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు బాలిక మరణించినట్లు ప్రకటించారు.

బాలిక ఆత్మహత్యపై ఆరా

ఈ ఘటనపై సమాచారం రాగానే పోలీసులు స్కూల్ క్యాంపస్‌కు చేరుకుని స్పాట్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. ప్రస్తుతానికి ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు.

Also Read: Amberpet Tragedy: హైదరాబాద్‌లో కలకలం.. మూఢనమ్మకమా? మనోవేధనా? ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య.

ఉపాధ్యాయుల మానసిక వేధింపుల వల్లే తన కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని బాలిక తండ్రి ఆరోపించారు. బాలిక చాలా రోజులుగా బాధపడుతోందని, అయితే పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటుందని ఊహించలేదని ఆయన అన్నారు.

Related News

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

Big Stories

×