E-Paper
Advertisement

Skull Scare: హైదరాబాద్‌లో మహిళ పుర్రె కలకలం.. ఇంతకీ ఎవరామె?

Skull Scare: హైదరాబాద్‌లో మహిళ పుర్రె కలకలం.. ఇంతకీ ఎవరామె?

Skull Scare: హైదరాబాద్‌ కీసర అటవీ ప్రాంతంలో పుర్రె కలకలం రేపింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్మయిపల్లి అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తికి సంబంధించిన పుర్రెను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పుర్రెను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి అది ఒక మహిళ పుర్రె అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఘటన జరిగి సుమారు రెండు నుండి మూడు నెలలు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మహిళను హత్య చేసి, ఆధారాలు దొరక్కుండా అటవీ ప్రాంతంలో పడేసి ఉంటారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. పుర్రె లభ్యమైన ప్రాంతంలో మరిన్ని ఆధారాల కోసం క్లూస్ టీం సహాయంతో గాలింపు చేపట్టారు.

మృతురాలిని గుర్తించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొన్ని నెలలుగా ఎక్కడైనా మహిళలు కనిపించకుండా పోయినట్లు  కేసులు నమోదై ఉంటే  వెంటనే తమను సంప్రదించాలని కీసర పోలీసులు ఇతర పోలీస్ స్టేషన్లకు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని, పుర్రెను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఎన్ఏ (DNA) పరీక్షల ద్వారా మృతురాలి ఆచూకీ కనుగొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Related News

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

Big Stories

×