Road Accident: తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ట్రావెల్ బస్సు ప్రమాదాలు మొదలయ్యాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. స్పాట్లో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. మరో 22 మంది వరకు గాయపడ్డారు. అసలు ఘటన ఎలా జరిగింది?
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
తెలుగు రాష్ట్రాల్లో ట్రావెల్ బస్సు ప్రమాదాలు మొదలయ్యాయి. కొన్నాళ్లుపాటు ప్రమాదాలు జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాజాగా ట్రావెల్ బస్సు ప్రమాదం కలకల రేపింది. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
ఇందల్వాయి మండలం గన్నారం సమీపంలోని జాతీయ రహదారిపై ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. దాదాపు 20 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళ్తోంది. ఘటన సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నారు.
ట్రావెల్ బస్సు బోల్తా.. స్పాట్లో నలుగురు మృతి
ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: విషాదం.. కన్న బిడ్డలను బావిలోకి తోసేసి.. తల్లి కూడా!
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇందల్వాయి మండలం గన్నారం వద్ద ట్రావెల్స్ బస్సు బోల్తా
నలుగురు మృతి, పలువురికి గాయాలు
ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు
హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర వెళ్తుండగా ప్రమాదం
Tragic road mishap in Nizamabad district. Private travels… pic.twitter.com/erkqEZ7zs0
— BIG TV Breaking News (@bigtvtelugu) March 13, 2026