E-Paper
Advertisement

Inter Student Suicide: దారుణం.. కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..

Inter Student Suicide: దారుణం.. కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య..
Advertisement

Inter Student Suicide: ఏపీలో దారుణం.. బస్సు ఆపమని చెప్పి కిందకు దిగి కాలువలోకి దూకి ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామానికి చెందిన జూనియర్ ఇంటర్ విద్యార్థిని మంగళవారం సాయంత్రం దుమ్మెన్ను కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది.

బస్సు ఆపి మరి.. కాలువలో దూకిన విద్యార్థి..

పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలంలోని మోర్త గ్రామానికి చెందిన కొప్పుల పూజిత(17) ప్రస్తుతం మండలంలోని ఒో ప్రవైటు జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతోంది. అయితే రోజులాగే ఉదయం కాలేజీకి వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా.. బస్సు దిమ్మెన్ను కాలువ వద్దకు రాగానే.. వాంతులు అవుతున్నాయి బస్సు ఆపమని చెప్పింది. ఆ తర్వాత హడావిడిగా బస్సు దిగి ఒక్కసారిగా కాలువ వంతెనపైకి ఎక్కి దూకేసింది. దీంతో తోటి విద్యార్థులు, బస్సు డ్రైవర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. తక్షణమే బస్సు, డ్రైవర్, అక్కడి స్థానికులు రక్షిద్దామని ప్రయత్నించగా.. కాలువ ఉదృతి ఎక్కువగా ఉండటంతో ఆమె కొట్టుకుపోయింది.

విద్యార్థిని పూజిత కోసం పోలీస్, రెవెన్యూ యంత్రాంగం గాలింపు

Advertisement

అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వెంటనే ఉండ్రాజవరం పోలీసులు, రెవెన్యూ ఆఫీసర్లు గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్‌లు, డైవర్ల సహాయంతో కాలువు దిగువ భాగాల్లో కూడా శోధించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ సంఘటన తెలిసిన పూజిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు షాక్‌లో ఉన్నారు. అయితే ఈమె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి మనస్పర్థలా వల్ల విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వారిద్దరు వేరువేరుగా ఉంటున్నారు. పూజితకు అక్క, అన్నయ్య కూడా ఉన్నారు. అమ్మమ్మ ఇంటి వద్ద ఉండి చదువుకుంటోంది పూజిత.. అయితే పూజిత చదువులో బాగా ఉండేదని, కానీ ఇటీవల మానసిక ఆందోళనలు కనిపించాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేపి దర్యాప్తు చేస్తున్నారు. అసలు పూజిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలు ఎమైనా ఉన్నాయా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో ఆలోచిస్తున్నారు. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×