Breaking News: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని బిలాస్ పూర్ జిల్లాలో టూరిస్ట్ బస్సుపై కొండచరియలు విరిగిపడడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో మొత్తం 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
#BreakingNews | Bus buried under debris after landslide in Himachal Pradesh's Bilaspur
Several passengers are feared trapped. Rescue operation underway.#HimachalPradesh #Bilaspur #BilaspurAccident pic.twitter.com/Xm5CMSIFfy
— DD News (@DDNewslive) October 7, 2025
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. తీవ్ర గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Weather News: భారీ వర్షాలు.. రేపు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్, అక్కడక్కడ పిడుగుల వర్షం..?