E-Paper
Advertisement

Jabalpur Crime: జబల్‌పూర్‌లో దారుణం.. రీల్స్ కోసం యువతుల కిడ్నాప్, ఆపై నరకం

Jabalpur Crime: జబల్‌పూర్‌లో దారుణం.. రీల్స్ కోసం యువతుల కిడ్నాప్, ఆపై నరకం

Jabalpur Crime:  సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ కావాలని చాలామంది ఉవ్విళ్లూరుతుంటారు. కొందరికి అనుకోకుండా రాత్రికి రాత్రే అదృష్టం వరిస్తుంది. మరికొందరు ఎంత ప్రయత్నాలు చేసినా దూరంగా ఉంటారు. అందుకోసం వాళ్లు చేయని పనులు అన్నీఇన్నీకావు.  ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు ఉన్నాయి. కేవలం రీల్స్ కోసం కొందరు యువతులు ఓ గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. యువతులను కిడ్నాప్ చేసి వారిని కొట్టిన దృశ్యాలను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాంటి ఘటన ఒకటి  జబల్‌పూర్‌లో వెలుగుచూసింది.

రీల్స్ కోసం యువతుల కిడ్నాప్

జబల్‌పూర్-గ్వారీ ఘాట్ ప్రాంతాలకు చెందిన ముగ్గురు మహిళలు ఓ గ్రూపుగా ఏర్పడ్డారు.  కొద్దిరోజుల కిందట ముగ్గురు యువతులు..  ఇద్దరు యువతుల్ని బెదిరించి కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత వారిని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి తమ ప్రతాపం చూపించారు. కిడ్నాప్ చేసిన యువతులను దారుణంగా కొట్టారు.

ఓ క్లిప్‌లో బాధితురాలి ముఖంపై పొగ తాగుతూ స్పష్టంగా కనిపించారు. మరో క్లిప్‌లో బాధితురాలిని చెంపదెబ్బ కొడుతూ దుర్భాషలాడారు. ఆ తతంగాన్ని మొత్తం వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

జబల్‌పూర్‌లో లేడీ గ్యాంగ్ ఆరాచకాలు

చివరకు బాధిత యువతుల్లో ఒకరు పోలీసులను ఆశ్రయించి, జరిగినదంతా చెప్పింది. కేసు నమోదు చేసిన పోలీసులు, రంగంలోకి దిగేశారు. ముగ్గురు యువతులను అరెస్ట్ చేశారు. వారిని విచారించిన పోలీసులకు అసలు విషయాలు తెలిసి షాకయ్యారు. కేవలం సోషల్ మీడియాలో పాపులర్ కోసం ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తేలింది. తరచుగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం, దాడులకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది.

ALSO READ: ఓఆర్ఆర్ పై ఘోర ప్రమాదం.. కారులో మంటు చెలరేగి డ్రైవర్ సజీవదహనం

నిందితులు కాంచ్‌ఘర్ ప్రాంతానికి చెందినవారు. అందులో ఇద్దరు మైనర్ బాలికలు కాగా, ఓ యువతి ఉంది. ఇద్దరు మైనర్లను జువైనల్ హోమ్‌కు తరలించారు. మరో యువతిని జైలుకు తరలించారు.ఆ ముగ్గురు అమ్మాయిల్లో ఎవరికీ ఎలాంటి నేర చరిత్ర లేదని తేలింది. కేవలం తాము చేసిన రీల్స్‌లో లైక్స్ పొందడానికి మాత్రమే ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తేలింది.

 

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×