Road Accident: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును అతి వేగంతో ఇంట్రా వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. అశ్వారావు పేట నుంచి వస్తున్న టాటా ఇన్ట్రా వాహనం నియంత్రణ కోల్పోయి ఎదురుగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన నేపథ్యంలో అశ్వారావుపేట- ఖమ్మం ప్రధాన రహదారి ప్రాంతంలో నిత్యం వాహన రాకపోకలు ఎక్కువగా ఉండటంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Also Read: సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఇద్దరు యువకులు..?
పోలీసులు ఘటనా స్థలం వద్ద సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన వాహనాలను క్రేన్ సహాయం తొలగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ నిర్లక్ష్యం లేక.. నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.