Bus Accident: ఉలపాడు మండలం రాజుపాలెం సమీపంలో.. శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కావేరి ట్రావెల్స్ బస్సు కూలీలతో వెళుతున్న ఆటోని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా .. పలువురికి గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. బస్సు డ్రైవర్ అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.
ఇదిలా ఉండగా, మరో ఘోర ప్రమాదం అదే రోజున కర్నూలు జిల్లాలోని మాధవరం గ్రామం శివారులో చోటుచేసుకుంది. గ్రీన్ లైన్ ట్రావెల్స్ బస్సు మంత్రాలయం నుంచి రాయచూరు వైపు ప్రయాణిస్తున్న సమయంలో అడ్డంగా వెళ్తున్న ఎద్దుల బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, ఒక ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది.
Also Read: కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు కార్లు ఢీ.. స్పాట్లో ఐదుగురు మృతి
స్థానికుల సహకారంతో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో కొంతసేపు రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.