E-Paper
Advertisement

Mahabubabad News: తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో బావిలో పడి తండ్రీకొడుకుల మృతి

Mahabubabad News: తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో బావిలో పడి తండ్రీకొడుకుల మృతి
Advertisement

మహబూబాబాద్ మండలం బలరాం తండాలో శనివారం అత్యంత విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌కు గురై తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులను తండ్రి మదన్ (40), కుమారుడు లక్షిత్ (6)గా పోలీసులు గుర్తించారు.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలం వద్ద ఉన్న బావి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారి లక్షిత్ ప్రమాదవశాత్తూ అక్కడే ఉన్న విద్యుత్ తీగలను తాకాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురై అదుపుతప్పి బావిలో పడిపోయాడు. గమనించిన తండ్రి మదన్, తన కుమారుడిని కాపాడాలనే ఆరాటంతో వెంటనే బావిలోకి దూకాడు. అయితే బావి వద్ద విద్యుత్ సరఫరా అవుతుండటంతో తండ్రి కూడా విద్యుత్ ఘాతానికి గురయ్యాడు.

Advertisement

దురదృష్టవశాత్తూ ఇద్దరూ నీటిలో మునిగి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడిని కాపాడబోయి తండ్రి కూడా ప్రాణాలు వదలడం స్థానికులను కన్నీరు పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ALSO READ: Hyderabad: నుమాయిష్ సందర్శకులకు అలర్ట్.. నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఈరోజు ఎగ్జిబిషన్ పర్యటన రద్దు..?

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×