Major Fire in Lodge: ఎండాకాలం రాకముందు భారీ అగ్నిప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రమాదానికి కారణాలు ఏమైనా కావచ్చు. తాజాగా కడప జిల్లా రాజంపేటలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రైల్వేస్టేషన్ రోడ్డు ఏరియాలోని దీప్ లాడ్జిలో అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు సజీవ దహనమయ్యారు. మరో 35 మందికి సురక్షితంగా బయటపడ్డారు.
రాజంపేట పట్టణంలోని ఓ లాడ్జిలో అగ్నిప్రమాదం
జరిగిన ఘటనలో అందులోని బస చేస్తున్నవారు హడలిపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగిందని పోలీసులు, ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగాలో దీప్ లాడ్జిలో మంటలు చెలరేగాయి. తొలుత రూమ్లోకి పొగ వాసన రావడంతో అందులోని స్టే చేస్తున్నవారు అలర్ట్ అయ్యారు.
మెలిక వచ్చి చూసేసరికి దట్టమైన పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్ముకోవడంతో చాలామందికి ఊపిరాడలేదు. ప్రాణ భయంతో కొందరు పైఅంతస్తుకు… మరికొందరు కింద ఫ్లోర్కు పరుగులు తీశారు. ఈలోగా స్థానికులు గమనించి వెంటనే పోలీసులు, అగ్నిమాపక శాఖకు సమాచారం చేరవేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.
ఒకరు సజీవ దహనం.. 38 మంది సేఫ్
కిటికీలు, డోర్లు పగలగొట్టి అందులోని వారిని కాపాడారు. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తెచ్చారు. ఘటన సమయంలో పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు, ఫైర్ సిబ్బంది లోపల గదులను పరిశీలించారు.
అప్పటికే శ్రీనివాసులు అనే వ్యక్తి సజీవ దహనమయ్యారు. ఘటన సమయంలో లాడ్జిలో దాదాపు 39 మంది ఉన్నారని సమాచారం. పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ షాపు సిబ్బంది ఉన్నారని తెలిపారు. అందరూ సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఏఎస్ పి మనోజ్ కుమార్ హెగ్డే స్వయంగా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
ALSO READ: రూ.590 కోట్ల బ్యాంకు డబ్బులు భార్య, బావమరిది ఖాతాల్లోకి