Big Stories

Vehicle Parking Dispute : పార్కింగ్ విషయంలో గొడవ.. వ్యక్తిని కొట్టి చంపిన మామ-అల్లుడు

Vehicle Parking Dispute Leads to Murder : వెహికల్ పార్కింగ్ విషయంలో జరిగిన గొడవ.. ఒక వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ హత్యపై అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ రాహుల్ కుమార్ భోల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

బాధితుడు అంకుష్ పవార్ (30) ఏప్రిల్ 28, ఆదివారం ఔసా తహసీల్ లోని ఏకంబి తండా గ్రామంలో తన బావ వివాహానికి హాజరయ్యేందుకు వచ్చాడు. అతని ఒక ఇంటి వద్ద వాహనాన్ని పార్క్ చేశాడు. దానిపై పొరుగున ఉన్న వ్యక్తి, అతని మామ గొడవ చేశారు. వాహనాన్ని ఇక్కడ ఎందుకు పార్క్ చేశావ్ అంటూ అంకుష్ పవార్ పై మాటల దాడికి దిగారు.

- Advertisement -

Also Read : గ్యాస్ సిలిండర్ తో కొట్టి.. వ్యక్తి దారుణ హత్య

ఇరువురి మధ్య మాట-మాట పెరగడంతో.. పవార్ తలపై ఇనుపరాడ్ తో కొట్టారు. అతనికి తీవ్రగాయమై రక్తస్రావం అవ్వడంతో.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతను మారమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News