Man killed Another man with Cylinder : ఒక వ్యక్తిని మినీ గ్యాస్ సిలిండర్ తో కొట్టి చంపిన ఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇద్దరి మధ్యన జరిగిన గొడవ ఆ వ్యక్తి హత్యకు కారణమైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకల రేపింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
మేడ్చల్ మండలం మురహరిపల్లి గ్రామానికి చెందిన లాకు .. ఛత్తీస్ గఢ్ లక్ష్మీదుర్గ శ్యామల వద్ద పనిచేస్తూ జీవనం సాగించేవాడు. అక్కడే రాజు అనే వ్యక్తి కూడా పనిచేస్తున్నాడు. ఉన్నట్లుండి ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. మూడు రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం (ఏప్రిల్28) సాయంత్రం షాప్ షెటర్లు సగం మూసి లాకు నిద్రపోయాడు.
Also Read : కరెంట్ బిల్లుపై గొడవ.. మహిళా టెక్నీషియన్ ను చంపిన వ్యక్తి
అదే సమయంలో రాజు అక్కడికి వచ్చాడు. గాఢనిద్రలో ఉన్న లాకుపై మినీ సిలిండర్ తో దాడి చేయడంతో.. అతను రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతూ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం రాజు పీఎస్ కు వెళ్లి జరిగిందంతా చెప్పి పోలీసులకు లొంగిపోయాడు. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసి.. లాకు మృతదేశాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. లాకును రాజు ఎందుకు హత్యచేశాన్నది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది.