E-Paper
Advertisement

Electricity Bill Dispute : కరెంట్ బిల్లుపై గొడవ.. మహిళా టెక్నీషియన్ ను చంపిన వ్యక్తి

Electricity Bill Dispute : కరెంట్ బిల్లుపై గొడవ.. మహిళా టెక్నీషియన్ ను చంపిన వ్యక్తి

Technician killed over electricity bill dispute : కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చిందని, అలా ఎందుకు వచ్చిందో చెప్పాలని విద్యుత్ అధికారులను ప్రశ్నించాడో వ్యక్తి. అందుకు సరిగ్గా స్పందించకపోవడంతో మహిళా టెక్నీషియన్ ను ఆఫీస్ లోనే పొడిచి చంపేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లా మోర్గావ్.. సుపా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

33 సంవత్సరాల అభిజిత్ పోటేకు రూ.570 అధికంగా కరెంట్ బిల్లు వచ్చింది. అలా ఎందుకు జరిగిందో తెలుసుకునేందుకు మోర్గావ్ లోని మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కో లిమిటెడ్ కార్యాలయానికి వెళ్లాడు. గతంలోనే దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా తన కరెంట్ బిల్లుపై స్పందించకపోవడంతో.. ఎంఎస్ఈడీసీఎల్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న రింకు తితే (26)పై కత్తితో దాడి చేశాడు.

Also Read : వ్యక్తి హత్యకు కారణమైన చపాతీ.. ఇద్దరిపై కేసు

ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఈ ఘటన ఏప్రిల్ 24, బుధవారం జరిగింది. పదిరోజుల సెలవు తర్వాత ఆఫీస్ కు వచ్చిన రింకుపై కత్తితో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. పోలీసులు రింకు మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి.. అభిజిత్ పై కేసు నమోదు చేశారు. 302 సెక్షన్ తో పాటు.. ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అభిజిత్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related News

Children Missing: ఒంగోలులో దారుణం.. నీటి కుంటలో నలుగురు చిన్నారులు గల్లంతు!

అమీర్‌పేటలోని షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు!

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

Big Stories

×