BigTV English
Advertisement

Karimnagar Incident: పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి శవమైన తల్లి.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న చిన్నారులు

Karimnagar Incident: పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి శవమైన తల్లి.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న చిన్నారులు

Karimnagar Incident: Karimnagar Incident: రాజన్న సిరిసిల్ల జిల్లా బొప్పాపూర్లో వివాహిత రమ్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రమ్య భర్త దుబాయ్‌లో ఉండగా.. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుటుంబ కలహాలతో రమ్య ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. స్కూల్‌కు వెళ్లి వచ్చిన పిల్లలు.. ఇంట్లోకి వెళ్లడానికి ప్రయత్నించగా.. వాళ్ల అమ్మ ఎంతసేపటికి డోర్‌ తీయలేదు. కిటికీలో నుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుంది. స్థానికులు.. ఇంటి తలుపులు బద్దలుకొట్టారు. విగతజీవిగా మారిన తల్లిని చూసి.. చిన్నారుల రోదనలు మిన్నంటాయి. వీళ్ల స్థితిని చూసి.. స్థానికులంతా కన్నీటిపర్యంతమయ్యారు.


పూర్తి వివరాల ప్రకారం..
అయితే రమ్యకు తన అత్తింటి వారితో, ముఖ్యంగా అత్తతో చిన్న చిన్న గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ కుటుంబ కలహాలు మనస్తాపానికి దారితీసి, ఆమె ఈ ఆలోచనకు పాల్పడినట్లు తెలుస్తుంది. అయితే రమ్య భర్త హరి దుబాయ్‌లో పని చేస్తున్నాడు. ఆయన విదేశాల్లో ఉండటంతో, రమ్య ఒంటరిగా అత్తింట్లో కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ ఉండేది. ఆమెకు ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.. వీరు స్కూల్ వయస్సు చేరినవారు. ఈ పిల్లలు స్కూలు నుంచి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, తల్లి విగతజీవిగా పడి ఉంది. పాపం ఆ చిన్నారులకు తెలియక’అమ్మా.. లే అమ్మా కళ్ళు తెరువు’ అని ఏడుస్తూ కన్నీరుమున్నీరుగా మారారు. ఈ దృశ్యం చూస్తే గుండె పగిలిపోతుంది. పాపం ఆ ముగ్గురు చిన్నారులు తల్లి మరణంతో అనాథలయ్యారు.

అత్తతో గొడవ కారణంగానే రమ్య ఉరి వేసుకుని ఆత్మహత్య..
ఈ ఘటన ఆ గ్రామంలో కలకలం రేపింది. అక్కడి స్థానికులు రమ్యను ఒక మంచి మహిళగా.. కుటుంబానికి తోడుగా ఉండేవారిగా చెబుతున్నారు. కానీ, కుటుంబంలో జరిగే చిన్న గొడవలు కూడా మానసికంగా ఒత్తిడి కలిగించి, ఇలాంటి దారుణ పరిణామాలకు దారితీస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య కేసుగా నమోదు చేసి, కుటుంబ కలహాలు కారణమా లేక వేరే కారణాలా అని విచారిస్తున్నారు. రమ్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. భర్త హరి దుబాయ్ నుంచి తిరిగి వచ్చి, పిల్లలను చూసుకోవాల్సి వచ్చింది.


Also Read: ఆ నేతలంతా జంప్? విజయనగరం వైసీపీలో ఏం జరుగుతుంది

తల్లి మృతితో అనాథలైన ముగ్గురు చిన్నారులు
ఈ మధ్య కాలంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మహిళల్లో ఆత్మహత్య రేటును పెంచుతున్నాయి. రమ్య విషయంలో, భర్త విదేశంలో ఉండటం వల్ల ఆమెపై ఒంటరి బాధ్యతలు ఎక్కువగా పడటం కూడా ఒక కారకంగా చెబుతున్నారు. కానీ తల్లిదండ్రులు ఇలాంటి నిర్ణయాలు తీసుకునే సమయంలో ఒక్కసారి వారి పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. తల్లిదండ్రులు వారిని నచ్చిన నిర్ణయం వారు తీసుకుంటే పాపం ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ ముగ్గురు చిన్నారులు ఇకపై ఎవరి ఆశ్రయంలో ఉంటారు? అనే ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి.

Related News

AP Crime: ఏపీలో దారుణం.. మద్యం మత్తులో కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లోనే మహిళ

Stray Dogs Attack: ఘోరం! బాలికపై వీధి కుక్కలు మూకుమ్మడి దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్

Husband Suicide: ఇంట్లో అత్త ఉండొద్దని భార్య గొడవ.. 15 వ అంతస్తు నుంచి దూకి భర్త ఆత్మహత్య

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. బైకర్ పై ఎర్రిస్వామి ఫిర్యాదు.. మద్యం కొనుగోలు వీడియో వైరల్

Maharashtra News: భార్యాభర్తల మధ్య గొడవ.. కోపంతో ఫారెస్టులోకి, కవలల గొంతు కోసిన తండ్రి

Love Failure: ప్రేమలో ఓడిపోయాను.. యువకుడి ఆత్మహత్య సెల్ఫీ వీడియో

Hyderabad News: హైదరాబాద్ జేఎన్టీయూ వద్ద కారు బీభత్సం.. డివైడర్, బైక్‌ని ఢీ కొట్టి, కారులో ముగ్గురు

Big Stories

×