E-Paper
Advertisement

Saidabad Mother Incident: కామాంధుడైన ప్రియుడికి.. కూతురిని బలిచ్చిన కన్నతల్లి!

Saidabad Mother Incident: కామాంధుడైన ప్రియుడికి.. కూతురిని బలిచ్చిన కన్నతల్లి!
Advertisement

కానీ ఇక్కడ ఓ తల్లి చేసిన పనికి.. సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతల్లే.. కూతురు జీవితాన్ని బుగ్గిపాలు చేసింది. కామంతో కళ్లు మూసుకుపోయి.. ప్రియుడి మోజులో పడి ఓ తల్లి మానవత్వం మరిచిపోయింది. ఆ చిన్నారిపై దారుణానికి పాల్పడింది. ఏ తల్లి చేయకూడని నీచానికి ఒడికట్టింది.

Advertisement

అసలేం జరిగిందంటే..

సైదాబాద్‌లో అమానుష ఘటన చోటుచేసుకుంది. బాలిక తల్లి జగన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం కొనసాగిస్తూ ఉండగా.. అతడు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో దారుణమైన విషయం ఏంటంటే.. బాలిక తల్లే ఈ దారుణానికి అంగీకరించడం. జగన్ అనే వ్యక్తితో బాలిక తల్లికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం కొనసాగుతుండగానే.. ఆమె కూతురిపై కన్నేశాడు అతను. ఇదే విషయాన్ని ఆ తల్లికి చెప్పడం.. దానికి ఆమె అంగీకరించడం జరిగింది. జగన్‌తో పాటు అతని స్నేహితుడు బాలరాజు కూడా ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న తండ్రి.. ముగ్గురిపై కేసు పెట్టాడు. నిందితులపై సైదాబాద్‌ పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు జగన్‌, బాలరాజ్‌తో పాటు బాలిక తల్లిని అరెస్ట్ చేశారు.

Advertisement

స్థానికుల ఆగ్రహం

ఇలాంటి ఘటనలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలంటే.. నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ.. స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. చిన్నారుల భద్రత కోసం ప్రభుత్వం మరింత కఠినమైన నిబంధనలు తీసుకురావాలని అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉంటే.. వైఎస్సార్ జిల్లా మైలవరంలో నాలుగేళ్ల చిన్నారి అత్యాచారం కేసు నిందితుడు.. రహమతుల్లా ఆత్మహత్య చేసుకున్నాడు. మైలవరం జలాశయంలో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రహమతుల్లా డెడ్‌బాడీని పోలీసులు తల్లికి అప్పగించగా.. డెడ్‌బాడీని తీసుకోవడానికి తల్లి నిరాకరించింది. మున్సిపల్ సిబ్బందికి అప్పగించడంతో దహన సంస్కారాలు చేపట్టారు. మృతుడు రహంతుల్లా ఘటన జరిగిన రోజునే పారిపోయినట్లు పోలీసులు తెలుపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×