E-Paper
Advertisement

Delhi News: ఢిల్లీలో దారుణం.. ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై హోటల్‌లో ఏం జరిగింది?

Delhi News: ఢిల్లీలో దారుణం.. ఎంబీబీఎస్ స్టూడెంట్‌పై హోటల్‌లో ఏం జరిగింది?
Advertisement

Delhi News: దేశ రాజధాని ఢిల్లీలో దారుణమైన ఘటన జరిగింది. పార్టీ పేరుతో హోటల్‌‌కు వెళ్లింది 18 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థిని. ఆ తర్వాత ఆమెని లోబరుచుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు ఓ యువకుడు. ఫోటోలు, వీడియోలు చూపించి నెల రోజులపాటు ఆమెని బ్లాక్‌‌మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఢిల్లీలో దారుణం 

Advertisement

పోలీసులు చెప్పిన వివరాల మేరకు హర్యానాలోని జింద్‌‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఢిల్లీలో ప్రైవేటు హాస్టల్‌‌లో ఉంటూ ఎంబీబీఎస్ చదువుతోంది. యువతి ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో పరిచయం ఉంది. అతడు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాడు. ఢిల్లీకి రాకముందు నుంచి వీరిద్దరికీ పరిచయం ఉంది. సెప్టెంబర్ 9న స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుందామని యువతిని నమ్మించాడు.

ఆ తర్వాత హోటల్ ఆపిల్‌కు రప్పించాడు. కూల్‌‌డ్రింక్‌‌లో మత్తుమందు కలిపి ఇవ్వడంతో తాగిన యువతి స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొంది. తన చిత్రాలు, వీడియోలను చిత్రీకరించి బెదిరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడినట్టు బాధితురాలి అందులో ప్రస్తావించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

హోటల్‌కి రప్పించి, ఆ తర్వాత బ్లాక్‌మెయిల్

ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు. ఈ ఘటన నార్త్‌‌వెస్ట్‌‌ ఢిల్లీలోని ఆదర్శ్‌‌నగర్‌‌‌‌లో చోటు చేసుకుంది. చివరికి బాధిత యువతి తన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని తెలిపింది. వారి సాయంతో అక్టోబర్ 2న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత బాధిత మహిళకు కౌన్సెలింగ్ ఇచ్చారు. మేజిస్ట్రేట్ ముందు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సివుంది.

ALSO READ:  పెళ్లయిన నెలరొజులకే ప్రేమ జంట మధ్య

ఆగస్టులో జరిగిన సామూహిక అత్యాచారం ఆరోపణలతో సహా ఇటీవలకాలంలో సిటీలో ఇలాంటి హై ప్రొఫైల్ లైంగిక హింస కేసులు నమోదవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ-ప్రైవేట్ ప్రదేశాలలో మహిళల భద్రత గురించి కొత్త చర్చలకు దారితీసింది.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×