E-Paper

నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!

నలుగురిపైకి దూసుకెళ్లిన రైలు.. గాల్లోకి ఎగిరిపడి అక్కడికక్కడే మృతి!
Advertisement

Train Accident: మధ్యప్రదేశ్‌లోని హేతంపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని ఘోర ప్రమాదం జరిగింది. ఖజురహో-ఉదయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడి మొబైల్ ఫోన్ పేలింది. దీంతో బోగీలో మంటలు చెలరేగాయంటూ ఒక్కసారిగా పుకార్లు షికార్లు చేశాయి. ఊపిరి ఆగిపోయేంత భయాందోళనకు గురైన ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకోవడానికి వెంటనే రైలు చైన్‌ను లాగారు. రైలు ఆగీఆగడంతోనే బోగీల నుంచి కిందికి దూకేశారు.

చీకటి పడుతున్న సమయం కావడం, ప్రాణభయంతో ఏం చేస్తున్నామో తెలియకపోవడంతో ప్రయాణికులంతా పక్కనే ఉన్న మరో రైల్వే ట్రాక్‌పైకి చేరారు. దురదృష్టవశాత్తూ అదే సమయంలో పక్క ట్రాక్ పైనుంచి పాతాళ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ వేగంగా దూసుకొచ్చింది. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ ఘోరంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే రైలు కిందపడి ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

Also Read: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. స్టార్ క్యాంపెయినర్ గౌతమి అవుట్!

మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది, స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. క్షణకాలం పాటు వ్యాపించిన తప్పుడు పుకారు, నలుగురి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. రైల్వే అధికారులు ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు.

Related News

సోలాపూర్‌లో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన వ్యాన్.. 8 మంది మృతి!

తొర్రూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. పెట్రోల్ ట్యాంకర్ ఢీకొని యువకుడు మృతి!

యాదాద్రి జిల్లాలో విషాదం.. గేట్ టుగెదర్ పార్టీలో టెక్కీ అనుమానస్పద మృతి!

కృష్ణానదిలో పడవ ప్రమాదం.. నలుగురు మృతి!

అమ్మాయితో ప్రేమాయణం.. ఆంటీతో సహజీవనం, ఒత్తిడి పెరిగి ఆ యువకుడు ఏం చేశాడంటే

మెడికల్ షాపులో దారుణం.. క్యాషియర్‌పై దుండగుల కాల్పులు.. స్పాట్‌లో ఒకరు మృతి, సీసీటీవీ కెమెరా సాక్షిగా

ఇంట్లోకి దూసుకెళ్లిన కారు.. చిన్నారితోపాటు ముగ్గురి మృతి, సిద్ధిపేట్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

×