BigTV English

Peddapali Crime News: కూతుర్ని చంపి, ఆపై ఉరేసుకున్న తల్లి.. ఏం జరిగింది?

Peddapali Crime News: కూతుర్ని చంపి, ఆపై ఉరేసుకున్న తల్లి.. ఏం జరిగింది?

Peddapali Crime News: పుట్టిన పిల్లలను అల్లారు ముద్దుగా చూసుకుంటుంది తల్లి. పిల్లల విషయంలో ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోరు. అలాంటిది కన్న తల్లి, రెండేళ్లు కూతుర్ని చంపేసింది. ఆపై ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. ఆమెకి ఎలాంటి ఫ్యామిలీ సమస్యలు లేవు. కాకపోతే ఒక్కటే కారణం. అదేంటి తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.


ఏం జరిగింది?

పైన కనిపిస్తున్న మహిళ పేరు సాహితి. వయస్సు 29 ఏళ్లు. ఆమెకు రెండేళ్లు పాప కూడా ఉంది. ఆమెకు నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది. ఆమె భర్త వేణుగోపాల్‌రెడ్డి ఎల్ఐసీ ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వేణుగోపాల్ ఫ్యామిలీ అంతా పెద్దపల్లిలోని టీచర్స్ కాలనీలో ఉంటున్నారు. భార్యాభర్తలు చిన్నారితో ఎంతో హాయిగా ఉండేవారు. సమస్యలు ఏమైనా వచ్చినా షేర్ చేసుకుంది సాహితి.


రెండురోజుల కిందట బాసర వెళ్లారు సాహితి-వేణుగోపాల్ దంపతులు. చిన్నారికి సరస్వతి దేవి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించారు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఏం జరిగిందో తెలీదు. సాహితి మనసులోని ఏమి ఆలోచన వచ్చిందో తెలీదు. లాలించిన చేతులతో కూతుర్ని చంపేసింది. ఆపై తను కూడా ఉరేసుకుంది.

అదేరోజు రాత్రి సాహితికి ఆమె పేరెంట్స్ ఫోన్ చేశారు. ఎంతకీ లిప్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చింది. ఈలోగా ఇరుగుపొరుగువారితో మాట్లాడారు. వారి వచ్చి చూడడంతో ఆత్మహత్య వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఎంటెక్‌ చదివిన సాహితి, కాసింత సన్నగా ఉండేది. తాను సన్నగా ఉన్నానంటూ బాధపడేది, ఆపై ఎక్కువగా ఆలోచించేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

ALSO READ: బోస్టన్ వ్యభిచార స్కామ్, భారత సంతతి సీఈవో అరెస్ట్

లేఖలో ఏముంది?

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇంట్లో పరిసరాలను గమనించారు. ఈలోగా ఓ లేఖ లభించింది. తన భర్త మంచివాడని పేర్కొంది. తన చావుకు ఎవరు బాధ పడొద్దని, తాను లేకుండా చిన్నారి ఎలా ఉంటుందోనన్న ఆవేదనతో వెంట తీసుకెళ్తున్నానని ప్రస్తావించింది.

దీంతో సాహితి గురించి వివరాలు తీయడం మొదలుపెట్టారు పోలీసులు. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బయటకు వెళ్లిన భర్త ఆలస్యంగా ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో తాను లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని కన్నీరుమున్నీరు అయ్యారు.

Related News

Kondapur News: హైదరాబాద్‌లో దారుణం.. బౌన్సర్లను చితికబాదిన కస్టమర్లు.. వీడియో వైరల్

Cyber Crime: సైబర్ నేరగాళ్ల కొత్త రకం మోసం.. పహల్గాం ఘటనను వాడుకుంటూ

Visakhapatnam News: విషాదం.. గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Medak District: రెచ్చిపోతున్న కామాంధులు.. ఛీ ఛీ గేదెపై అత్యాచారం, ఎక్కడో కాదు..!

Doctor Negligence: ఫుల్‌గా తాగి నిద్రపోయిన డాక్టర్.. నవజాత శిశువు మృతి

Vijayawada News: ఏపీ పోలీసులకు చెమటలు.. చెర నుంచి తప్పించుకున్న బత్తుల, తెలంగాణ పోలీసుల ఫోకస్

Bengaluru News: బెంగుళూరులో దారుణం.. 12 ఏళ్ల కూతురి కళ్ల ముందు.. భార్యని చంపిన భర్త

Robbery In Khammam: దొంగల బీభత్సం.. ఒకే రాత్రి ఆరు ఇళ్లల్లో చోరీ

Big Stories

×