Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. కూతురి నిశ్చితార్థానికి ముందు, ఆమెకు కాబోయే అత్త గారితో పరారయ్యాడు తండ్రి. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తప్పిపోయిన మహిళను గురువారం పోలీసులు కనుగొన్నారు. ఉంట్వాసా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ వారం రోజుల నుంచి కనిపించడంలేదని ఆమె కుమారుడు పోలీసులను ఆశ్రయించాడు. మిస్సింగ్ కేసుపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
గురువారం ఆమెను చిక్లి గ్రామంలో మహిళలను కనుగొన్నారు. ఆమె 50 ఏళ్ల వ్యక్తితో ఇంట్లోంచి పరారైనట్లు పోలీసులు గుర్తించారు. అతడు… ఆమె కొడుకుకు కాబోయే భార్యకు తండ్రి అని తెలిసింది. చిక్లికి చెందిన ఓ వ్యక్తి భార్య ఇటీవల మృతి చెందింది. అతడు తన ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. తన కుమార్తెకు ఇటీవల ఓ మహిళ కొడుకుతో నిశ్చితార్థం చేసుకోవాలని నిర్ణయించారు.
నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలో, కాబోయే అత్త, మామలు ఇద్దరూ ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నారు. వీరిద్దరూ ఇంట్లోంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటన రెండు కుటుంబాలను షాక్కు గురిచేసింది.
“ఎనిమిది రోజుల క్రితం 45 ఏళ్ల మహిళ కనిపించడం లేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఆమె తన భర్త, 18, 20 ఏళ్ల ఇద్దరు పిల్లలను వదిలి 50 ఏళ్ల మరో వ్యక్తితో వెళ్లిపోయింది. అతడి కూతురితో ఆ మహిళ కొడుకు నిశ్చితార్థం చేసుకోవలసి ఉంది. వధువు తండ్రి, వరుడి తల్లి ఇద్దరూ కలిసి జీవించాలని నిర్ణయించుకుని ఇంట్లో పరారయ్యారు” అని పోలీస్ అధికారి చెప్పారు.
Also Read: Bengaluru Crime: అంబులెన్స్ బీభత్సం.. ముగ్గురు మృతి, వాహనాన్ని ఎత్తి పడేసిన స్థానికులు, వీడియో వైరల్
అయితే ఆ మహిళ తన ప్రేమికుడిని విడిచిపెట్టడానికి నిరాకరిస్తుంది. అతనితోనే ఉండాలని కోరుకుంటున్నట్లు చెబుతోంది. కుటుంబ సభ్యులు ఆమెను ఇంటికి తిరిగి రమ్మని కోరినా ఫలితం లేకపోయింది.