E-Paper
Advertisement

Nalgonda Crime: ప్రియురాలి శాడిజం..బిడ్డకు పాలిస్తున్న ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి..

Nalgonda Crime: ప్రియురాలి శాడిజం..బిడ్డకు పాలిస్తున్న ప్రియుడి భార్యపై పెట్రోల్‌ పోసి..
Advertisement

Nalgonda Crime: నేటి సమాజంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు పెడుతున్నాయి. తన మాట వినడం లేదన్న కోపంతో, ఓ మహిళ తన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఈ దారుణమైన ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం ఎంతటి దారుణాలకు దారితీస్తుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.

కేతపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్‌కు అప్పటికే వివాహమై.. మమత అనే భార్య, ఒక చిన్నారి ఉంది. అయితే.. అదే గ్రామానికి చెందిన సుజాత అనే మహిళతో నగేష్ గత కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. సుజాతకు కూడా ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ క్రమంలో.. తన ఇద్దరు కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకోవాలని సుజాత నగేష్‌ను బలవంతపెట్టడం మొదలుపెట్టింది. దీనికి నగేష్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా తీవ్రస్థాయిలో గొడవలు జరుగుతున్నాయి.

Advertisement

తన మాట వినలేదన్న కోపంతో రగిలిపోయిన సుజాత.. నగేష్ కుటుంబాన్ని అంతం చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో నగేష్ ఇంటికి వెళ్ళిన సుజాత, అక్కడ తన చంటి బిడ్డకు పాలిస్తున్న మమతపై ఒక్కసారిగా పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఆ సమయంలో మమత ఒడిలో ఉన్న చిన్నారిని సుజాత దూరంగా విసిరేసింది. మంటలు వేగంగా వ్యాపించడంతో మమత తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఈ దాడిలో దూరంగా విసిరేసిన చిన్నారి కూడా తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. అమానుషంగా ఒక మహిళను సజీవ దహనం చేసిన అనంతరం, నిందితురాలు సుజాత నేరుగా నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి, ఘటన స్థలాన్ని పరిశీలించారు. వివాహేతర సంబంధం వల్ల ఒక నిండు ప్రాణం బలికావడం, పసిపాప అనాథగా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisement

Also Read: పగడ్బందీగా స్కెచ్.. కోఠి ఏటీఎం కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×