Koti SBI ATM Robbery: హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ ఏటీఎం నగదు చోరీ కేసుపై సీపీ సజ్జనార్ అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని కోజికోడ్కు చెందిన రిన్షాద్ అనే వ్యక్తి హోల్సేల్ స్టాక్ కొనుగోలు నిమిత్తం ₹6 లక్షల నగదుతో జనవరి 7న నగరానికి చేరుకున్నారు. ఈరోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో ఆ నగదును బ్యాంకులో జమ చేసేందుకు ఆయన కోఠిలోని ఎస్బీఐ (SBI) ఏటీఎం సెంటర్కు వెళ్లారు.
అదే సమయంలో అక్కడ పొంచి ఉన్న ఇద్దరు గుర్తుతెలియని దుండగులు తుపాకీతో రిన్షాద్ను బెదిరించారు. ప్రతిఘటించే ప్రయత్నం చేయగా.. దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రిన్షాద్ కుడి కాలికి గాయమైంది. వెంటనే నిందితులు ఆయన వద్ద ఉన్న నగదు సంచిని, వాహన తాళాలను లాక్కొని.. బాధితుడి వాహనంలోనే అక్కడి నుండి పరారయ్యారు. నిందితులు చాదర్ఘాట్ మీదుగా కాచిగూడ వైపు వెళ్లినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అయితే పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు నిందితులు కొంత దూరం వెళ్ళాక వాహనాన్ని వదిలేసి, తమ దుస్తులు మార్చుకుని కాలినడకన పారిపోయినట్లు సమాచారం.
బాధితుడి ఫిర్యాదు మేరకు సుల్తాన్బజార్ పోలీసులు పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక క్రైమ్ టీమ్స్ను రంగంలోకి దింపారు. ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ఏవైనా ఆధారాలు లేదా సమాచారం తెలిసిన వారు వెంటనే డయల్ 100కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని నగర పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డ్రగ్స్ కలకలం.. రూ. 9.5 కోట్ల హైడ్రోపోనిక్ గంజాయి సీజ్!
కోఠి ఘటనను అత్యంత తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎక్స్ వేదికగా వెల్లడించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్
నిందితులను త్వరితగతిన పట్టుకునేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాలు ఏర్పాటు
ఈ ఘటనకు సంబంధించి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ నం. 28/2026గా కేసు నమోదు
భారతీయ న్యాయ సంహితలోని… https://t.co/rTXdBboTH3 pic.twitter.com/sSXl6rl0Xb
— BIG TV Breaking News (@bigtvtelugu) January 31, 2026