E-Paper
Advertisement

Nalgonda Student Murder: ఫ్రెండ్‌ రూమ్‌‌కి తీసుకెళ్లి.. చిన్న గొడవకు చంపేసి.. నల్గొండలోదారుణం

Nalgonda Student Murder: ఫ్రెండ్‌ రూమ్‌‌కి తీసుకెళ్లి.. చిన్న గొడవకు చంపేసి.. నల్గొండలోదారుణం
Advertisement

Nalgonda Student Murder: నల్గొండలో ఇంటర్ విద్యార్ధిని దారుణ హత్యకు గురైంది. ఓ యువకుడు హత్య చేసి పరారయ్యాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఘటన వివరాలు

Advertisement

స్థానిక  సమాచారం ప్రకారం.. గడ్డం కృష్ణ అనే వ్యక్తికి, బాలికకు ఆరు నెలల నుంచి ప్రేమవ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది. స్నేహితుడు రూమ్‌కి తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడి.. ఆ తర్వాత హత్య చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు.. హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని

Advertisement

వార్త అందుకున్న వెంటనే చిట్యాల పోలీసు అధికారులు.. సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఫొరెన్సిక్ క్లూస్ టీమ్‌ను పిలిపించి ఆధారాలు సేకరిస్తున్నారు. దాడిలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రేమ వ్యవహారం కోణంలో దర్యాప్తు

ప్రాథమిక విచారణలో పోలీసులు ప్రేమ వ్యవహారమే కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా ఆ యువకుడు, విద్యార్థిని మధ్య ఎలాంటి విభేదాలు జరిగాయా? లేక ఎవరైనా ఆమెను వేధించారా? అనే కోణాల్లో విచారణ చేస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి స్టేట్మెంట్లు  తీసుకుంటున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అతడి మొబైల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు.

పిల్లల భద్రతపై మళ్లీ చర్చ

ఈ ఘటనతో విద్యార్థినుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. తల్లిదండ్రులు, పాఠశాలలు, కాలేజీలు విద్యార్థుల సేఫ్టీ కోసం మరింత అప్రమత్తంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు. ప్రతి చిన్న గ్రామంలో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. పాఠశాల సమయాల్లో పర్యవేక్షణ ఉండాలి అంటూ ప్రజలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

పోలీసుల కఠిన చర్యల హామీ

నల్గొండ జిల్లా ఎస్పీ ఈ ఘటనపై స్పందిస్తూ.. నిందితుడిని త్వరలో పట్టుకుని చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. మహిళలపై, చిన్నారులపై నేరాలు ఏవైనా జరిగినా సహించబోమని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ టీములు నిందితుడిని వెతికేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

సమాజంలో పెరుగుతున్న హింస 

ఇటీవలి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై.. హింసాత్మక ఘటనలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. విద్యార్థుల్లో విలువల విద్య, మానసిక దృఢత అవసరమని వారు సూచిస్తున్నారు.

Also Read: బిగ్ బాస్కెట్ పేరుతో ఆన్‌లైన్ మోసం..

నిందితుడు వెంటనే పట్టుబడి, చట్టపరమైన కఠిన శిక్ష ఎదుర్కోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×