BigTV English

Red Sandal Smugling: తిరుపతి నుంచి ఢిల్లీకి.. 10 టన్నుల ఎర్రచందనం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Red Sandal Smugling: తిరుపతి నుంచి ఢిల్లీకి.. 10 టన్నుల ఎర్రచందనం పట్టివేత.. ఇద్దరు అరెస్ట్

Red Sandal Smugling: దేశ రాజధానిలో ఎర్రచందనం స్మగ్లర్లపై.. పోలీసులు భారీగా దాడి చేశారు. ఢిల్లీలోని తుగ్లకాబాద్ ప్రాంతంలో నిర్వహించిన సడెన్ రైడ్‌లో.. 10 టన్నుల ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి అంచనా విలువ రూ.6 కోట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌ను ఢిల్లీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) ఆంధ్రప్రదేశ్ RSA ,  ASDL విభాగాలతో సంయుక్తంగా చేపట్టింది. అక్రమ రవాణాలో పాలుపంచుకున్న ఇద్దరు ప్రధాన స్మగ్లర్లు ఇర్ఫాన్, అమిత్ సంపత్ పవర్‌లను పోలీసులు అరెస్టు చేశారు.


తిరుపతి నుంచి ఢిల్లీకి అక్రమ రవాణా

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. ఎర్రచందనం దుంగలను ఏపీలోని తిరుపతి అటవీ ప్రాంతాల నుండి స్మగ్లర్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. అవి ట్రక్కుల ద్వారా ఇతర సరుకు పేరుతో ఢిల్లీకి తరలించబడ్డాయి. తుగ్లకాబాద్‌లోని ఒక ప్రైవేట్ గోడౌన్‌లో ఈ దుంగలను నిల్వ చేసి, అక్కడి నుండి విదేశాలకు తరలించే ప్రణాళికతో ఉన్నారని సమాచారం.


అంతర్జాతీయ నెట్‌వర్క్‌పై అనుమానం

దర్యాప్తు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్మగ్లింగ్ రాకెట్ అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తోందని, ముఖ్యంగా చైనా, దక్షిణాసియా దేశాలకు ఎర్రచందనం అక్రమంగా ఎగుమతి అవుతోందని వెల్లడించారు. ఇర్ఫాన్ హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కాగా, అతను చాలాకాలంగా ఎర్రచందనం స్మగ్లింగ్ రాకెట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. అమిత్ సంపత్ పవర్ ముంబైకి చెందిన వ్యక్తి. అతడు ప్రధానంగా రవాణా ఏర్పాట్లు చూసుకునేవాడిగా గుర్తించారు.

చైనాకు నెపాల్, మయన్మార్ మార్గాల ద్వారా రవాణా

స్మగ్లర్లు నేరుగా చైనా పంపకుండా, ముందుగా ఎర్రచందనం దుంగలను నేపాల్, మయన్మార్ సరిహద్దుల ద్వారా అక్రమంగా తరలిస్తారని వెల్లడించారు. అక్కడి నుండి అవి చైనాలోని వాణిజ్య కేంద్రాలకు చేరుతాయి. ఈ మార్గం ద్వారా వారు అధికారులు కనుగొనకుండా సురక్షితంగా స్మగ్లింగ్ చేస్తారని పోలీసులు చెప్పారు.

 దర్యాప్తు కొనసాగుతుంది

ఎర్రచందనం స్మగ్లింగ్ భారత్‌లో నిషేధితమని తెలిసినప్పటికీ, దాని డిమాండ్ అంతర్జాతీయంగా అధికంగా ఉండటంతో అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. తుగ్లకాబాద్ ఆపరేషన్ తర్వాత ఈ రాకెట్‌లో మరిన్ని వ్యక్తులు, కంపెనీలు ప్రమేయం ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఢిల్లీ STF అధికారులు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం హై క్వాలిటీగా ఉందని, ఒక్క టన్ను ధర మార్కెట్లో రూ.60 లక్షలు దాకా ఉంటుందని తెలిపారు.

మొత్తం నెట్‌వర్క్‌ను బట్టబయలు చేయాలన్న లక్ష్యం

ఇప్పటికే ఇర్ఫాన్, అమిత్ సంపత్ పవర్‌లను.. ఎఫ్‌ఎస్ఎల్ ల్యాబ్‌కి తీసుకువెళ్లి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. వారు ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉన్నారో, ఈ ఎర్రచందనం ఎక్కడి నుండి ఎలా సేకరించారో తెలుసుకునేందుకు విచారణ సాగుతోంది. దక్షిణ భారత రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఈ నెట్‌వర్క్ బలంగా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Also Read: ఫ్రెండ్‌ రూమ్‌‌కి తీసుకెళ్లి.. చిన్న గొడవకు చంపేసి.. నల్గొండలోదారుణం

అంతర్జాతీయ మార్కెట్లో ఎర్రచందనానికి అధిక డిమాండ్ ఉండటంతో.. స్మగ్లర్లు ఈ అక్రమ వ్యాపారంలో నిమగ్నమవుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ కేసు ద్వారా దేశవ్యాప్తంగా పనిచేస్తున్న స్మగ్లింగ్ గ్యాంగులపై మరిన్ని ఆధారాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

Related News

Pakistan Train Blast: పాకిస్థాన్‌లో పేలుళ్లు.. పట్టాలు తప్పిన రైలు

Bengaluru News: యువతి ఊపిరి తీసిన చెట్టు.. బెంగుళూరులో ఘటన, ఏం జరిగింది?

CJI: సీజేఐపై దాడికి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన పలువురు నేతలు..

Aadhaar Updates: ఆధార్ కొత్త రూల్స్.. ఇకపై ఉచితంగా అప్డేట్, దాని అర్హతలేంటి?

Bihar Elections: బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. రెండు విడతల్లో పోలింగ్, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు

Indian Air Force: ట్రబుల్‌కి.. ట్రిపుల్ ధమాకా! భారత్ జోలికొస్తే ఊచకోతే..

Supreme Court: సుప్రీంకోర్టులో ఊహించని ఘటన.. సీజేఐపై చెప్పు విసరబోయిన న్యాయవాది, ఆపై గందరగోళం

Big Stories

×