E-Paper
Advertisement

డిచ్‌పల్లిలో పట్టపగలే భారీ చోరీ.. 12 తులాల బంగారం, నగదు మాయం!

డిచ్‌పల్లిలో పట్టపగలే భారీ చోరీ.. 12 తులాల బంగారం, నగదు మాయం!
Advertisement

Nizamabad: నిజామాబాదు జిల్లా డిచ్‌పల్లి మండల కేంద్రంలో ఈరోజు పట్టపగలే భారీ చోరీ జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇస్లాంపూర్ కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన ఇంటికి తాళం వేసి పని నిమిత్తం బ్యాంకుకు వెళ్లారు. అదే అదునుగా భావించిన దొంగలు, యజమాని లేని సమయాన్ని చూసి రెచ్చిపోయారు.

తాళం పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బీరువాలో ఉన్న సొత్తును దోచుకెళ్లారు. బాధితుడు తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు అస్తవ్యస్తంగా పడి ఉండటంతో లబోదిబోమన్నారు. ఈ దొంగతనంలో సుమారు 12 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 12 లక్షల నగదు మాయమైనట్లు సమాచారం.

Advertisement

ప్రజలు రాకపోకలు సాగించే పట్టపగలే ఇంత పెద్ద ఎత్తున చోరీ జరగడంతో కాలనీవాసులు భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Also Read:నాగర్‌కర్నూల్‌లో వాన బీభత్సం.. తడిసిన ధాన్యం.. రోడ్డెక్కిన రైతన్నలు!

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×