Palnadu Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముప్పాళ్ల మండలం దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద అతివేగంగా వచ్చిన ఒక కారు బైకును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యువకులు తమ పని ముగించుకుని బైకుపై వెళ్తుండగా, అడ్డరోడ్డు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు వీరిని బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ అక్కడ ఆగకుండా వెళ్ళిపోయినట్లు సమాచారం. ఢీకొట్టిన ధాటికి యువకులు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు, తీవ్ర రక్తస్రావం కావడంతో వారు కోలుకునే లోపే ప్రాణాలు విడిచారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ హఠాత్పరిణామంతో మృతుల గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
Also Read: సుఖోయ్-57 సీక్రెట్ డీల్.. చైనా గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న భారత్ మాస్టర్ ప్లాన్!
బైక్ ను ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు స్పాట్ లో మృతి
పల్నాడు జిల్లా దమ్మాలపాడు అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం
ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Car Collides with Bike; Two Youths Die on the Spot
Road Accident at Dammalapadu Addarodu in Palnadu District
Police Launch… pic.twitter.com/bmVQlELbso— BIG TV Breaking News (@bigtvtelugu) April 29, 2026