E-Paper
Advertisement

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

ఏపీలో దారుణం.. వీడియోలు తీస్తూ మ‌హిళ‌పై అత్యాచారం

Palnadu: పల్నాడు జిల్లా నకరికల్లు మండలంలో ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. ఓ గ్రామానికి చెందిన మహిళ భర్తతో విడాకులు తీసుకుని, తన ముగ్గురు కుమార్తెలతో కలిసి ఒంటరిగా జీవిస్తోంది. అయితే, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో ఆమెకు నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అర్ధరాత్రి మాట్లాడాలంటూ ఆ వ్యక్తి ఆమెకు ఫోన్ చేసి గ్రామ శివారుకు రప్పించాడు.

అక్కడికి చేరుకునే సరికే ప్రియుడు, అతని సోదరుడు పూర్తిస్థాయిలో మద్యం మత్తులో ఉన్నారు. ఒంటరిగా వచ్చిన సదరు మహిళను చూసి ఇద్దరూ కలిసి ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఘోరానికి ఒడిగట్టారు. మొబైల్‌లో వీడియోలు తీస్తూ ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ దారుణానికి ఒడిగట్టిన ప్రధాన నిందితుడు ఒక గ్రామ సచివాలయ ఉద్యోగి కావడం గమనార్హం. కేవలం ఈ ఘటనే కాకుండా, గతంలోనూ అతనిపై పలు మోసపూరిత కేసులు నమోదైనట్లు స్థానికులు చెబుతున్నారు. కామాంధుల చేతిలో దారుణానికి గురైన ఆ బాధితురాలు ప్రస్తుతం తీవ్ర భయాందోళనల నడుమ న్యాయం కోసం ఎదురుచూస్తోంది.

Also Read: వేములవాడకు మహర్దశ: రూ.1000 కోట్లతో టూరిజం హబ్‌గా మాస్టర్ ప్లాన్!

Related News

కూకట్‌పల్లిలో దారుణం.. భార్యను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన భర్త!

అరుణాచలం గిరిప్రదక్షిణ దారిలో ఘోరం..ఇద్దరు యువతులపై గ్యాంగ్‌రే*ప్

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

Big Stories

×