Railway Employee: స్వేచ్ఛ బ్యూరో : డోర్నకల్ మండలంలోని వెన్నారం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి బోయినపల్లి ఆంజనేయులు గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
స్థానికుల కథనం ప్రకారం, ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటుపడిన ఆంజనేయులు సుమారు రూ.30 లక్షల వరకు అప్పుల పాలైనట్లు సమాచారం. అప్పుల ఒత్తిడే ఆత్మహత్యకు కారణమై ఉండొచ్చని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: కిషన్ రెడ్డివి మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు.. ఎంపీ చామల సంచలన ఆరోపణలు!