E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు, స్పాట్‌లో

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు, స్పాట్‌లో

Road Accident: శీతాకాలం వేళ రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. దట్టమైన పొగ మంచు కారణంగా ముందు వాహనాలను గమనించలేక పోతున్నారు. ఫలితంగా ఘోరమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో స్పాట్‌‌లో ముగ్గురు మృత్యువాతపడ్డారు.

ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్న కారు, డివైడర్‌ని బలంగా ఢీ కొట్టింది. ఆపై గాల్లోకి ఎగిరింది. అందులోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనలో కారులో ఐదుగురు ఉన్నారు.

మృతుల్లో 9 ఏళ్ల బాలుడు ఉన్నాడు. వీరంతా చండ్రుగొండ నుండి సత్తుపల్లి వైపు వస్తుండగా ఈ ఘటన జరిగింది. కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టడంతో మొత్తం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న వారు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. డివైడర్ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఎలాంటి సూచిక బోర్డు లేకపోవడం కారణంగా తెలుస్తోంది.

డివైడర్‌ను ఢీ కొట్టి ఎగిరిపడిన కారు

దీనికితోడు దట్టమైన పొగమంచు కారణంగా చెబుతున్నారు ఆ ప్రాంతవాసులు. ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.

మృతులు ఎక్కడివారు, ఎక్కడికి వెళ్తున్నారు? అనేదానిపై గాయపడిన వారి నుంచి ఆరా తీస్తున్నారు. ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. నుజ్జైన కారుని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

ALSO READ: రగిలిపోతున్న నెల్లూరు, లేడీ డాన్ కామాక్షి ఇల్లు ధ్వంసం

మరోవైపు గతరాత్రి హైదరాబాద్-మలక్‌పేట చౌరస్తా సమీపంలోని టీవీ టవర్స్ వద్ద ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఆస్మాన్‌గడ్ నుంచి వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బస్సు, లారీలను ఢీ కొట్టింది. ఆపై మెట్రో బ్రిడ్జి కింద డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అయితే పలువురు గాయపడ్డారు. దీంతో కాసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఈలోగా పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేశారు.

 

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×