Konaseema Accident: అతివేగం ప్రమాదకరం.. పదే పదే రోడ్లపై హెచ్చరిక బోర్డులు కనిపిస్తున్నాయి. అయినా వాహనాదారులు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. వేగంగా వెళ్లే క్రమంలో వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని. ఫలితంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. తాజాగా కోనసీమ జిల్లాలో అలాంటి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం
డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాజోలు మండలంలోని కడలి గ్రామంలోని ప్రదాన పంట కాల్వలోకి దూసుకెళ్లింది స్విఫ్ట్ డిజైర్ కారు. ఈ ఘటనలో ములికిపల్లి గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు తేజ మృతి చెందాడు.
ఆదివారం వేకువజామున ఇద్దరు యువకులు కారులో ప్రయాణిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటన సమయంలో కారులో ఒక్కడే ఉన్నాడు. వేరే యువకుడు వాటర్ బాటిల్ కోసం ములికిపల్లి సెంటర్లో ఓ షాపు వద్ద దిగాడు. దీంతో ఆ యువకుడికి ప్రమాదం తప్పింది.
పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు
ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే స్థానికులు అక్కడికి చేరుకుని కారులోని వ్యక్తిని బయటకు తీశారు. అప్పటికే మృతి చెందాడు. పోలీసులు అక్కడికి వచ్చి కారుని కాల్వ నుంచి బయటకు తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
ALSO READ: ట్రావెల్ బస్సుల యాక్సిడెంట్లు.. స్పాట్లో 35 మంది, తిరుపతి, గద్వాలల్లో