Tirupati Accident: తిరుపతి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చిల్లకూరు హైవేపై ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదానికి గురైన బస్సు, గుంటూరు శబరిమలకు వెళ్తోంది. ఏం జరిగిందో ఒక్కసారిగా బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో పులువురు క్షేమంగా బయటపడ్డారు. అసలేం జరిగింది.
ఏపీ-తెలంగాల్లో ట్రావెల్ బస్సుల ప్రమాదాలు
ఈ మధ్యకాలం తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘటనలకు తోడు దట్టమైన పొగమంచు కారణంగా ప్రమాదాల తీవ్రత పెరిగింది. తాజాగా తిరుపతి జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్లకూరు హైవే వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. రైటర్ సత్రం వద్ద ఈ ఘటన జరిగింది.
ఈ ఘటన ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటన సమయంలో బస్సులో 35 మంది అయ్యప్ప భక్తులు భక్తులు ఉన్నారు. వీరంతా గుంటూరు నుంచి శబరిమలకు బస్సులో వెళ్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సు శౌర్యన్ ట్రావెల్ కి చెందినది. ఓవైపు విమానాల రద్దు.. మరోవైపు బస్సుల ప్రమాదాలతో బెంబేలెత్తిపోతున్నారు ప్రయాణికులు.
తిరుపతి, గద్వాలల్లో బస్సు ప్రమాదాలు, ప్రయాణికులు బెంబేలు
ఇదిలాఉండగా గద్వాల జిల్లా మానవపాడు శివారులో మరొక ట్రావెల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. సిమెంట్ దిమ్మెలను ఢీ కొని రోడ్డు పక్కకు దూసుకెళ్లింది బస్సు. ఆ సమయంలో రోడ్డు పక్కనున్న చెట్టుని ఢీ కొట్టింది. అప్పుడు ఆగింది ట్రావెల్ బస్సు. ఈ ఘటనలో బస్సు నుంచి సురక్షితంగా 27 మంది ప్రయాణికులు బయటపడ్డారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది.
ALSO READ: గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. 23 మంది స్పాట్ డెడ్