Kurnool Lorry Accident: వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తుంది. ప్రస్తుతం మృత్యువు ఎటు నుంచి వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వీటన్నింటికి కారణం డ్రైవర్ల నిర్లక్ష్యం, వారి అతివేగం వల్లే జరుగుతుందని అధికారులు తెలిపారు. అయితే నేడు ఉదయం కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కేశవ గ్రాండ్ హోటల్ సమీపంలోని.. హైదరాబాద్ – బెంగళూరు జాతీయ రహదారిపై ప్రమాదం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు స్పాట్లోనే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ ఆపి రిపేరు చేసుకుంటున్న సమయంలో మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. లారీ డ్రైవర్ అతివేగమా.. మద్యం మత్తులో డ్రైవింగ్ చేశాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: శంషాబాద్లో తీవ్ర విషాదం.. భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్య..