E-Paper
Advertisement

Gadwal Road Accident: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ నీట్ కోచింగ్ కు వెళ్తూ ఒకరు మృతి

Gadwal Road Accident: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ  నీట్ కోచింగ్ కు వెళ్తూ ఒకరు మృతి

Gadwal Road Accident:  స్వేచ్ఛ, బ్యూరో: ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరికి గాయాల య్యాయి. ఈ సంఘటన జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలోకి వెళ్లితే… అయిజకు పట్టణానికి చెందిన రాము(17), మిట్టదొడ్డి గ్రామానికి చెందిన విష్ణు, గద్వాల గంజిపేటకు చెందిన వర్ధన్ ముగ్గురు హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని స్వంత గ్రామాలకు వచ్చారు.‌ రాము, విష్ణు‌ ఇద్దరు నీట్ ఎగ్జామ్ కు సిద్దమయ్యేందుకు హైదరాబాద్ కి బయలుదేరారు.

Also Read:Puri Jagannadh: ఆ రైటర్‌ క్రెడిట్ మొత్తం పూరి కొట్టేశాడా? అందుకేనా ఈ పరాజయాలు? 

ఆర్టీసి బస్సును రైల్వే స్టేషన్ ముందు

ఈ క్రమంలో గద్వాల రైల్వే స్టేషన్ కు వెళ్లారు. హైదరబాద్ వెళ్లే రైళ్లుకు కొంత సమయం ఉందని తెలియడంతో గద్వాలలో ఉంటున్న వర్దన్ ముగ్గురు కలిసి బైక్ మీద గద్వాల్ టౌన్ లోకి వెళ్తున్న క్రమంలో గద్వాల్ నుంచి అయిజకు వెళ్తున్న ఆర్టీసి బస్సును రైల్వే స్టేషన్ ముందున్న అయిజ రోడ్డుపై బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న రాము(17) సంఘటన స్థలంలో‌ మృతి చెందాడు. మిట్టదొడ్డికి చెందిన విష్ణు, గద్వాల్ కు చెందిన వర్దన్ కు గాయాలు కాగా చికిత్స‌కోసం కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కేసుచేసి పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు టౌన్ ఎస్ఐ కళ్యాణ్ కుమార్ తెలిపారు.

న్యాయం చేయాలని ధర్నా

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాము కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బైఠాయించారు. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ‌ టి.శ్రీను, గద్వాల టౌన్ ఎస్ఐ‌ కళ్యాణ్ కుమార్, రూరల్ ఎస్ఐ శ్రీకాంత్‌ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుసకవచ్చారు. రోడ్డు ప్రమాదానికి గల కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: Street Lights: ఢిల్లీ తరహాలో స్ట్రీట్ లైట్ మెయింటెనెన్స్… టెండర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Tags

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×