Road Accident: వరుస బస్ ప్రమాదాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. జనగామ జిల్లా రఘునాథ్ పల్లి మండలం నిడిగొండ దగ్గర మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీ కొట్టింది ఆర్టీసీ బస్సు. ప్రమాదంలో బస్సులోని ఇద్దరు మృతి చెందగా, ఆరుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: దారుణం.. తమ్ముడికి పెళ్లి చేశాడని కత్తితో పొడిచి..పెట్రోల్ పోసి తగలబెట్టి..
మృతులు హన్మకొండ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. వారు పులమాటి ఒం ప్రకాష్, నవదీప్ సింగ్. ఒం ప్రకాష్, నవదీప్ సింగ్ మృతి వారి కుటుంబానికి తీవ్రమైన మానసిక దెబ్బ తీసుకొచ్చింది. మరోవైపు, ఆరుగురు తీవ్ర గాయాలతో బాధపడ్డారు. వారిలో కొందరు బస్సు ముందు సీట్లలో కూర్చుని ఉండటం వల్ల ఎక్కువ దెబ్బలకు గురయ్యారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను జనగామ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం గాయపడినవారి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు.