E-Paper
Advertisement

Hindupur Politics: వైసీపీ ఆఫీస్ దాడి ఎఫెక్ట్.. హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ, నేతల హౌస్ అరెస్ట్

Hindupur Politics: వైసీపీ ఆఫీస్ దాడి ఎఫెక్ట్.. హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ, నేతల  హౌస్ అరెస్ట్
Advertisement

Hindupur Politics: కావాలనే టీడీపీ కేడర్‌ని వైసీపీ రెచ్చగొడుతోందా? ఏదో విధంగా ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందా? ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీ నేతలు ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారు? ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఆదివారం హిందూపూర్ వెళ్లనున్నారా? ఎమ్మెల్యే రానున్న నేపథ్యంలో వైసీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారా?

హిందూపూర్‌లో ఎమ్మెల్యే బాలకృష్ణ

Advertisement

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ‌లో ఆదివారం పర్యటిస్తున్నారు హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సోమేందేపల్లి‌లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు బాలకృష్ణ.

హిందూపురంలోని వైసీపీ ఆఫీసుపై దాడి కేసులో ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడి ఘటనలో 16 మంది టీడీపీ నాయకులపై హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. హిందూపురం వైసీపీ ఇన్‌ఛార్జ్ దీపిక భర్త వేణు‌రెడ్డి‌తోపాటు మరో ఎనిమిది మందిపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసులు నమోదు చేశారు పోలీసులు.

Advertisement

పలువురు వైసీపీ నేతల హౌస్ అరెస్ట్

ఈ పరిస్థితి నేపథ్యంలో హిందూపూర్ వెళ్లారు ఎమ్మెల్యే బాలకృష్ణ. ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో వారిని హిందూపూర్‌కు వెళ్లకుండా నాయకులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి ఉష‌శ్రీలను హౌస్ అరెస్ట్ చేశారు.

ఈ ఘటన గురించి తెలుసుకునేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ అక్కడికి వెళ్లారు. పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఘటన ముందు, ఆ తర్వాత వేణురెడ్డి వ్యాఖ్యలు మాత్రం రెచ్చగొట్టేలా ఉన్నాయిని అంటున్నారు టీడీపీ నేతలు.

ALSO READ:  రాజకీయాల్లోకి వస్తే వంగవీటి రంగా మార్క్ చూపిస్తా- ఆశా కిరణ్

ఇంతకీ ఘటన తర్వాత వేణురెడ్డి ఏమన్నారు? అధికారం చేతిలో ఉందని టీడీపీ వాళ్లు హిందూపురంలో మా పార్టీ ఆఫీస్‌పై దాడి చేశారని అన్నారు. ఒక చెంపపై కొడితే మరో చెంప చూపించడానికి తామేమీ గాంధీలం కాదని, వైసీపీ కార్యకర్తలమని అన్నారు. మీ అరాచకాలు ఇలానే కొనసాగితే.. జగన్ 2.O ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నామని అన్నారు.   ఏ ఒక్కర్నీ వదలమని చెప్పకనే చెప్పారాయన.

Related News

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

Big Stories

Advertisement
×