E-Paper
Advertisement

Sangareddy District: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. స్పాట్‌లో 15 మంది

Sangareddy District: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. స్పాట్‌లో 15 మంది
Advertisement

Sangareddy District: సంగారెడ్డి జిల్లా సదాశివపేట సమీపంలోని NH 65పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పట్టణ శివార్లలోని బైపాస్ రోడ్డు వద్ద గల ప్రమాదకరమైన మూలమలుపు వద్ద ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. జహీరాబాద్ నుండి సదాశివపేట బస్టాండ్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును, ఎదురుగా అతివేగంగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టడంతో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది.

అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 50 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద ధాటికి ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురై కేకలు వేశారు. స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి, బస్సు అద్దాలు పగులగొట్టి లోపల చిక్కుకున్న వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లలో చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

క్షతగాత్రులలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది, వారిని మెరుగైన వైద్యం కోసం సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. మూలమలుపు వద్ద డ్రైవర్ల అజాగ్రత్త లేదా మితిమీరిన వేగం ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన వాహనాలను పక్కకు తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.

Also Read: నాగార్‌కర్నూల్‌లో ఘోరం.. నీటి తొట్టిలో 3 నెలల పసికందు అనుమానాస్పద మృతి..

Advertisement

రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడా లేదా బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ప్రయాణికుల కుటుంబ సభ్యులు ఈ వార్త తెలియగానే ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ విషాద ఛాయలు అలముకున్నాయి. అధికారులు బాధితులకు తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×