Road Accident: జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఉదయం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది గాయపడ్డారు. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని సమీపంలోని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలు ఘటన ఎలా జరిగింది?
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఇటిక్యాలపాడు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేషనల్ హైవే-44 పై ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు. అందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది.
గాయపడినవారిని ఆంబులెన్స్లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చాలామందికి కాళ్లు,చేతులు భారీగా డ్యామేజ్ కావడంతో అక్కడి దృశ్యాలు అందరినీ కలిచి వేశాయి. తెల్లవారుజామున ఘటన జరగడంతో క్షతగాత్రుల అహంకారాలతో ప్రాంతమంతా విషాదంగా మారింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.