E-Paper
Advertisement

Rapido Driver Crime: జల్సాలకు బానిసై.. రక్తం రుచి మరిగిన ర్యాపిడో డ్రైవర్: మామిడిపల్లి కేసు మిస్టరీ వీడింది

Rapido Driver Crime: జల్సాలకు బానిసై.. రక్తం రుచి మరిగిన ర్యాపిడో డ్రైవర్: మామిడిపల్లి కేసు మిస్టరీ వీడింది

Rapido Driver Crime: జల్సాలకు అలవాటు పడి, ఈజీ మనీ కోసం నేరాల బాట పట్టిన ఓ ర్యాపిడో డ్రైవర్ ఘాతుకం ఆలస్యంగా వెలుగుచూసింది. కేవలం బంగారం కోసం ఒంటరి మహిళపై కత్తితో దాడి చేసి, గొంతు కోసి చంపడానికి ప్రయత్నించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా కంది మండలం మామిడిపల్లిలో ఈ నెల 22న జరిగిన ఈ చైన్ స్నాచింగ్, హత్యాయత్నం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సత్తయ్య ఈ కేసు వివరాలను వెల్లడించారు.

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన జగన్ ఉపాధి కోసం ర్యాపిడో (Rapido) బైక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే వచ్చే ఆదాయం సరిపోకపోవడం, మద్యానికి బానిస కావడం, జల్సాలకు అలవాటు పడటంతో అడ్డదారులు తొక్కాడు. ర్యాపిడో బుక్ చేసుకునే వారిలో ఎవరైనా ఒంటి నిండా బంగారం ధరించి వస్తే, వారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించి దోచుకోవాలని ప్లాన్ వేశాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కత్తిని కూడా కొనుగోలు చేశాడు. అయితే, గత కొన్ని రోజులుగా బంగారం ధరించిన వారు ఎవరూ అతని బైక్ ఎక్కకపోవడంతో జగన్ అసహనానికి గురయ్యాడు. ఎలాగైనా దొంగతనం చేయాలని మరో ప్లాన్ వేశాడు.

ఈ క్రమంలో ఈ నెల 22న కంది మండలం మామిడిపల్లి శివారులో పశువులు కాస్తున్న ఓ మహిళ జగన్ కంట పడింది. ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును చూసి ఎలాగైనా దాన్ని కాజేయాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్దకు వెళ్లి మాటలు కలిపాడు. అదను చూసి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతులో బలంగా పొడిచాడు. మెడలోని 4 తులాల మంగళసూత్రాన్ని లాక్కునే ప్రయత్నం చేశాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో, విచక్షణ కోల్పోయిన జగన్ ఆమె కడుపులో మరోసారి కత్తితో పొడిచి, గొలుసు లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో ఉన్న బాధితురాలిని స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించారు.

కేసు నమోదు చేసుకున్న సంగారెడ్డి రూరల్ పోలీసులు.. సాంకేతిక ఆధారాలు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేశారు. ర్యాపిడో డ్రైవర్ జగన్ కదలికలను గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని నుంచి చోరీకి గురైన బంగారు ఆభరణాలను, నేరానికి వాడిన బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జల్సాల కోసం అమాయకుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సూచించారు.

Read Also: Hyderabad News: రూటు మార్చిన మహిళా టెక్కీ.. బాయ్ ఫ్రెండ్స్‌తో కొత్త వ్యాపారం, అడ్డంగా దొరికిపోయింది

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×