E-Paper
Advertisement

Vijayawada: విజయవాడలో దారుణం.. మూడేళ్ళ చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి

Vijayawada: విజయవాడలో దారుణం.. మూడేళ్ళ చిన్నారిపై టీచర్ యాసిడ్ దాడి

Vijayawada: దారుణం.. విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతంలో ఉన్న నేషనల్ స్కూల్‌లో మానవత్వం మంటగలిసే ఘటన చోటుచేసుకుంది. కేవలం మూడేళ్ల వయసున్న ఎల్‌కేజీ విద్యార్థినిపై ఓ ఉపాధ్యాయురాలు అత్యంత క్రూరంగా యాసిడ్‌తో దాడికి పాల్పడింది. అభం శుభం తెలియని పసిపాపపై ఇంతటి అమానుషానికి ఒడిగట్టడం వెనుక గల కారణాలు విస్తుగొలుపుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతారని నమ్మి టీచర్ల వద్దకు పంపితే, ఇలాంటి ఘటనలు జరగడం విద్యావ్యవస్థపైనే నమ్మకాన్ని సడలించేలా ఉంది.

సంఘటన జరిగిన వెంటనే నిజానిజాలు దాచిపెట్టి, బాధితురాలి తల్లికి ఫోన్ చేసి పాప బాత్‌రూంలో పడిపోయిందని స్కూల్ యాజమాన్యం తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. అయితే, గాయాల తీవ్రత చూసి అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పాపను ఆసుపత్రికి తరలించగా, వైద్యుల పరీక్షల్లో అది సాధారణ గాయం కాదని, యాసిడ్ వంటి ప్రమాదకర ద్రవాల వల్ల జరిగిన దాడి అని తేలింది. దీంతో స్కూల్ టీచర్ చేసిన ఘాతుకం బయటపడింది.

ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు నేషనల్ స్కూల్ యాజమాన్యం తొలుత వైద్య ఖర్చులు భరిస్తామని ఆశ చూపి బాధితులతో రాజీ పడాలని ప్రయత్నించింది. కానీ, తమ బిడ్డకు జరిగిన అన్యాయంపై న్యాయం జరగాలని తల్లిదండ్రులు పట్టుబట్టడంతో, యాజమాన్యం తమ అసలు స్వరూపాన్ని బయటపెట్టింది. రాజీ ప్రయత్నాలు విఫలమవ్వడంతో బాధితులను బెదిరింపులకు గురిచేయడం వారి బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపుతోంది.

Also Read: ఢిల్లీలో దారుణం.. హోలీ వేడుకల్లో గొడవ, యువకుడిని దారుణంగా చంపారు

ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికులు, ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చిన్నారుల రక్షణ విషయంలో కనీస జాగ్రత్తలు తీసుకోని యాజమాన్యంపై, కసాయి టీచర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సదరు పాఠశాల గుర్తింపును రద్దు చేయడంతో పాటు, దోషులను చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Related News

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

Big Stories

×