Crime News: స్వేచ్ఛ బ్యూరో: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా రెండు చోరీ ఇళ్ల ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికంగా సంచలనం రేపింది. దీంతో అక్కడి స్ధానికులు భయాందోళనుకు గరైతుననారు. దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదుతో పాటు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న పల్సం కార్తీక్ కుమార్ తన తల్లితో కలిసి ఈనెల 25న స్వగ్రామానికి వెళ్లగా, 26 ఉదయం పొరుగువారి ద్వారా ఇంటిలో చోరీ జరిగినట్లు సమాచారం అందింది. ఇంటికి చేరుకుని చూడగా ప్రధాన తలుపు తాళాలు పగులగొట్టబడి ఉండగా, బెడ్రూమ్ బీరువాలోని సుమారు 20 తులాల వెండి, 5 గ్రాముల బంగారు ఉంగరం, 43 అంగుళాల ఎంఐ టీవీ, రూ.18 వేల నగదు అపహరించబడినట్లు గుర్తించారు.
Also read: చాలా రోజుల విరామం తరువాత తిరిగి జిమ్కు వెళుతున్నారా? ఈ సమస్యలు రావడం ఖాయం
మరో ఘటన పర్వతాపూర్లో చోటుచేసుకుంది. ఆకుల మధుసూదన్ బంధువుల మరణ కార్యక్రమానికి వెళ్లి రెండు రోజుల తర్వాత తిరిగి రాగా ఇంటి వచ్చి వెనుక తలుపు పగులగొట్టబడింది. లోపల సామగ్రి చిందరవందరగా ఉండగా, బెడ్రూమ్ అల్మారాలు తెరిచి సుమారు 30 తులాల వెండి ఆభరణాలు దొంగిలించినట్లు అక్కడి భాదితులు గుర్తించారు. బాధితుల ఫిర్యాదులతో మేడిపల్లి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస చోరీల నేపథ్యంలో కాలనీవాసులు రాత్రి వేళల్లో పోలీస్ పహారా పెంచాలని కోరుతున్నారు. వరుస సంఘటనలు జరుగుతుండటంతో అక్కడి స్థానికులు రాత్రైతే భయంతో జంకుతున్నారు. దీనిపై స్పిందిని పోలీసులు రాత్రి వేళల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీలులు తెలిపారు.
Also read: ఆండ్రాయిడ్ 16తో వస్తున్న ఫస్ట్ ఫోన్ ఇదేనా? Xiaomi 17T అదిరిపోయే ఫీచర్లు లీక్!