Road Accidents: వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాక.. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుతున్నాయి.. తప్ప అస్సలు తగ్గడం లేదు.. ఇప్పుడు కూడా ఉదయాన్నే రోడ్డు ప్రమాదాలు జరిగాయి..
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
మహబూబ్నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్వాడ మండలం పిల్లిగుండు NH-167 జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. మరో లారీ డ్రైవర్ను అక్కడి స్థానికులు రక్షించారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిపారు.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారీ అగ్నిప్రమాదం.. వ్యక్తి సజీవదహనం!
మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పిల్లిగుండు NH-167పై ఘటన
ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొని పెద్దఎత్తున చెలరేగిన మంటలు
ఈ ప్రమాద ఘటనలో లారీ డ్రైవర్ సజీవదహనం pic.twitter.com/zgopURYTfa
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2025
Also Read: ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపురం వద్ద బైక్ను ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యాకూబ్, వెంకట్ రెడ్డిగా గుర్తించారు. మృతులిద్దరూ ప్రాణస్నేహితులని సమాచారం. వారి మరణ వార్త విని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
వెంకటాపురం వద్ద బైక్ను ఢీకొట్టిన డీసీఎం
ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి
మృతులు యాకుబ్, వెంకట్ రెడ్డిగా గుర్తింపు pic.twitter.com/RYLKksgByI
— BIG TV Breaking News (@bigtvtelugu) November 27, 2025