E-Paper
Advertisement

Road Accidents: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ముగ్గురు మృతి..

Road Accidents: రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ముగ్గురు మృతి..

Road Accidents: వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. బయటకు వెళ్లాలంటే చాలు ప్రజలు భయపడిపోతున్నారు. మృత్యువు ఎటువైపు నుంచి వస్తుందో అర్థం కాక.. రోజు రోజుకు రోడ్డు ప్రమాదాలు పెరుతున్నాయి.. తప్ప అస్సలు తగ్గడం లేదు.. ఇప్పుడు కూడా ఉదయాన్నే రోడ్డు ప్రమాదాలు జరిగాయి..

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హన్వాడ మండలం పిల్లిగుండు NH-167 జాతీయ రహదారిపై ఇథనాల్ ట్యాంకర్, లారీ ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి సజీవ దహనమయ్యారు. మరో లారీ డ్రైవర్‌ను అక్కడి స్థానికులు రక్షించారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం తెలిపారు.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మూడు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ఘనంగా భట్టి విక్రమార్క కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెంకటాపురం వద్ద బైక్‌ను ఓ డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను యాకూబ్, వెంకట్ రెడ్డి‌గా గుర్తించారు. మృతులిద్దరూ ప్రాణస్నేహితులని సమాచారం. వారి మరణ వార్త విని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Related News

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Medchal Crime: అల్వాల్‌లో దొంగల బీభత్సం కలకలం.. 30 తులాల బంగారం చోరీ..!

ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Big Stories

×