Moinabad Murder: మొయినాబాద్ డబుల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్పిచ్చిన వారిని పథకం ప్రకారం అందరని కరీమ బేగం చంపేసింది. పోలీసుల ఇన్విస్టిగేషన్లో కీలక విషయాలను కరీమ బేగం బయటపెట్టింది. నాకు కొంత సమయం ఇస్తే మరో 5మందిని చంపి.. మీ ముందు లొంగిపోతా అని పోలీసులతో కరీమ బేగం తెలిపింది. దీంతో పోలీసులు ఓక్కసారిగా షాక్ కి గురయ్యారు.
తనకి అప్పు ఇచ్చిన మరో 5మంది మహిళలను చంపుదాం అంటే వారు తప్పించున్నారు అని పోలీసులతో కరీమ బేగం తెలిపింది. అయితే మిగతా తాను చంపాలను కున్న 5 మంది పేర్ల లిస్టును కరీమ బేగం పోలీసుల అందించింది. దీంతో పోలీసులు లిస్ట్లో ఉన్న వాళ్ళకి కాల్ చేసి మాట్లాడారు. మీ అదృష్టం బాగుంది అంటూ ఈ రోజు ఆమె అరెస్ట్ కాక పోయి ఉంటే నిన్ను చంపేసేది అంటూ.. మహిళకు ఫోన్ చేపసి పోలీసులు తెలిపారు.
Also Read: రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలపై వార్తలు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!
అయితే గతంలో చాలా సార్లు కరీమ బేగం మమ్ములను మొయినాబాద్ పరిసరాల్లో ఉన్న ఓ ఫార్మ్ హౌస్ కి 5 మందిని పిలిచిందని పోలీసులకు లిస్టులో ఉన్న వారు తెలిపారు. మేము వివిద కారణాల వల్ల వెళ్లలేక పోయాం అని ఆ బాదితులు తెలిపారు. వృద్ధులని హత్య చేసిన తర్వాత కూడా మరో ఇద్దరిని చంపడానికి కరీమ బేగం ప్రయత్నించానంటు ఇన్విస్టిగేషన్లో పోలీసులకు కరీమ బేగం తెలిపింది. దీంతో భాదితులు కరీమ బతికి ఉంటే మాకు ప్రాణహాని ఉందని పోలీసులక భాదితులు తెలిపారు.
Also read: బండి బగీరథ్ కేసులో.. హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్!