False Campaign: బండి బగీరథ్ కేసులో హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా బండి బగీరథ్ కేసు సంచలనం సృష్టించిన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే బండి భగీరథ్కు బెయిల్ మంజూరు చేస్తే, దానికి ప్రతిఫలంగా హైకోర్టు జడ్జి భర్తకు ఒక ప్రముఖ ప్రభుత్వ చైర్మన్ పదవిని కేటాయిస్తారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఈ అంశం పై ఎవరు పుకార్లు పుట్టించారంటూ దీనికి సంభందించిన వారిపై పోలీసులు కేసు నమొదు చేశారు.
Also read: పెట్రోల్, ఎరువుల ధరలు పెంచేసి.. వడ్ల ధరలు మాత్రం పెంచరా.. కేంద్రం పై మంత్రి తుమ్మల ఫైర్!
ఈ తప్పుడు ప్రచారం పై పోలీసులు తీవ్రంగా స్పందించారు. అయితే ఈ అంశం ఎవరు సృష్టిచారంటూ పోలీసుల తీవ్రంగా శ్రమించి ఎట్టకేలకు అతడిని పట్టుకున్నారు. బగీరథ్ కేసులో ఈ పోస్టు పెట్టిన వ్యక్తి ఆంద్రప్రదేశ్ లోని నెళ్లూరు జిల్లాకు చెందిన దామోదర్ అనే వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. సైబర్ పోలీసులు మరియు సంభందిత శాఖ పోలీసులు కొన్ని సాంకేతిక ఆధారాలు సేకరించి ఐపి అడ్రస్, మరియు అతడి అకౌంట్ పూర్తి వివరాలు సేకరించి సైబర్ పోలీసుల సహయంతో అతడిని అరెస్టు చేశారు.
హైకోర్టు జడ్జిపై తప్పుడు ప్రచారాలు చేసిన వ్యక్తి అరెస్ట్
బండి భగీరథ్కు బెయిల్ ఇస్తే తన భర్తకు చైర్మన్ పదవి ఇస్తారంటూ ప్రచారం
నెల్లూరుకు చెందిన దామోదర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/xO022KsoSO
— BIG TV Breaking News (@bigtvtelugu) May 19, 2026
Also Read: రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలపై వార్తలు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!