BigTV English

Son Killed Step Mother : పల్నాడులో దారుణం.. కరెంట్ షాక్ పెట్టి, గడ్డపారతో కొట్టి తల్లి హత్య

Son Killed Step Mother : పల్నాడులో దారుణం.. కరెంట్ షాక్ పెట్టి, గడ్డపారతో కొట్టి తల్లి హత్య

Son Killed Step Mother : పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. శంకాపురంలో ఆస్తి కోసం పెంచిన తల్లిని అతికిరాతకంగా చంపాడు కసాయి కొడుకు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామంలో బాణావత్ లక్ష్మీబాయి నివాసం ఉంటోంది. అయితే ఆమె పెంచిన కొడుకు దత్తు నాయక్.. ఇంటిని తన పేరున రాయాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు.


ఇంటిని దత్తు నాయక్(30) పేరుపై రాసేందుకు లక్ష్మీబాయి(45) ఒప్పుకోలేదు. ఆమెపై కక్ష పెంచుకున్న దత్తు.. అడ్డుతొలగిస్తే ఇల్లు తనదే అవుతుందనుకున్నాడు. గత అర్థరాత్రి సమయంలో లక్ష్మీబాయి ఇంటిలో నిద్రిస్తుండగా.. మెయిన్ కరెంట్ లైన్ నుంచి ఇంటిలోకి కరెంటును లాగాడు. ఆమె కాళ్లకు కరెంట్ వైర్లు చుట్టి.. చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందాడు. ఆపై ఆమె తలపై గుణపంతో కొట్టి హత్య చేశాడు. అనంతరం తనకు తానుగానే దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు దత్తు చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి.. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.


Tags

Related News

Road Accident: పండగ వేళ విషాదం.. అక్కతో రాఖీ కట్టించకున్న కాసేపటికే.. అనంత లోకాలకు!

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

Big Stories

×