E-Paper
Advertisement

Son Killed Step Mother : పల్నాడులో దారుణం.. కరెంట్ షాక్ పెట్టి, గడ్డపారతో కొట్టి తల్లి హత్య

Son Killed Step Mother : పల్నాడులో దారుణం.. కరెంట్ షాక్ పెట్టి, గడ్డపారతో కొట్టి తల్లి హత్య

Son Killed Step Mother : పల్నాడు జిల్లాలో దారుణ ఘటన జరిగింది. శంకాపురంలో ఆస్తి కోసం పెంచిన తల్లిని అతికిరాతకంగా చంపాడు కసాయి కొడుకు. దాచేపల్లి మండలం శంకరాపురం గ్రామంలో బాణావత్ లక్ష్మీబాయి నివాసం ఉంటోంది. అయితే ఆమె పెంచిన కొడుకు దత్తు నాయక్.. ఇంటిని తన పేరున రాయాలని కొద్దిరోజులుగా వేధిస్తున్నాడు.

ఇంటిని దత్తు నాయక్(30) పేరుపై రాసేందుకు లక్ష్మీబాయి(45) ఒప్పుకోలేదు. ఆమెపై కక్ష పెంచుకున్న దత్తు.. అడ్డుతొలగిస్తే ఇల్లు తనదే అవుతుందనుకున్నాడు. గత అర్థరాత్రి సమయంలో లక్ష్మీబాయి ఇంటిలో నిద్రిస్తుండగా.. మెయిన్ కరెంట్ లైన్ నుంచి ఇంటిలోకి కరెంటును లాగాడు. ఆమె కాళ్లకు కరెంట్ వైర్లు చుట్టి.. చిత్రహింసలకు గురిచేసి రాక్షసానందం పొందాడు. ఆపై ఆమె తలపై గుణపంతో కొట్టి హత్య చేశాడు. అనంతరం తనకు తానుగానే దాచేపల్లి పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు దత్తు చెప్పిన వివరాల మేరకు కేసు నమోదు చేసి.. లక్ష్మీబాయి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపారు.

Tags

Related News

గంజాయి డాన్‌గా మారిన సస్పెండెడ్ కానిస్టేబుల్.. రూ.79 లక్షల డ్రగ్స్ సీజ్!

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి? మృతులు పెరిగే అవకాశం, పేషెంట్ల బంధువుల్లో టెన్షన్

అనంతపురంలో ఘరానా మోసం.. స్టాక్ మార్కెట్ పేరుతో రూ.25 కోట్లు స్కామ్!

ఢిల్లీ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

విశాఖలో ఘరానా మోసం.. క్రిప్టో కరెన్సీ పేరిట రూ.10 కోట్లు వసూలు!

దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై ఘోరం.. యువతి ఆత్మహత్య!

‘కిల్లర్’ మూవీ సెట్లో విషాదం.. గ్యాస్ సిలిండర్ పేలి టెక్నీషియన్ మృతి

ఏపీలో వేర్వేరు ప్రాంతాల్లో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖలో రెండు వాహనాలను ఢీ కొట్టిన బొలెరో వ్యాన్

Big Stories

×