Lovers Incident: ఈ రోజుల్లో సిన్సియర్ కంటే టైం పాస్ లవ్ ఎక్కువైంది.. కొందరు సిన్సియర్గా లవ్ చేసిన వారిని ఎవరో ఒకరు మోసం చేస్తున్నారు. దీంతో వారు ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్నారు. ఇదంతా ఎందుకంటే.. అమ్మాయి మోసం చేసిందని పురుగుల మందు తాగిన యువకుడు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందాడు..
పూర్తి వివరాల్లోకి వెళితే..
నిజామాబాద్ జిల్లా దొంచందా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు శ్రీకాంత్ అనే యువకుడు. అయితే దొంచందా గ్రామానికి చెందిన అఖిల, శ్రీకాంత్ 6 ఏళ్లు ప్రేమించుకున్నారు. ఉద్యోగ రిత్య శ్రీకాంత్ లండన్లో ఉంటున్నాడు.
కానీ, ప్రస్తుతం అఖిల కోసం ఇటీవలే లండన్ నుంచి తిరిగొచ్చాడు శ్రీకాంత్. అయితే శ్రీకాంత్కు అఖిల భారీ షాక్ ఇచ్చింది. ఎంటంటే.. యువతి పరిస్థితుల కారణం వల్లనో లేదా శ్రీకాంత్ను కావలనే వదిలేయలనో పలు కారణాల వల్ల వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై.. శ్రీకాంత్ సూసైడ్ చేసుకున్నాడు.
Also Read: ఛీ.. ఛీ.. వీడు మనిషేనా.. ఎవరూ ఊహించని రీతిలో భార్యను చంపిన భర్త
వెంటనే కుటుంబ సభ్యులు యువకుడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శ్రీకాంత్ చనిపోయేముందు తన చావుకు అఖిలనే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసాడు. తమకు న్యాయం చేయాలంటూ శ్రీకాంత్ మృతదేహాంతో ఆందోళన చేస్తున్నారు అతని కుటుంబసభ్యులు..