Bank Robbery: గుజరాత్లోని సూరత్ నగరంలో పట్టపగలే ఓ భారీ బ్యాంకు దోపిడీ చోటుచేసుకుంది. వరాచా ప్రాంతంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ లక్ష్యంగా దుండగులు అత్యంత పక్కా ప్రణాళికతో ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్న సమయంలోనే లోపలికి ప్రవేశించిన దుండగులు, మొదట అక్కడి అలారం వ్యవస్థను నిర్వీర్యం చేశారు. దీనివల్ల బయటి ప్రపంచానికి లేదా పోలీసులకు సమాచారం అందకుండా జాగ్రత్తపడ్డారు. అనంతరం తుపాకులతో బ్యాంకు సిబ్బందిని, ఖాతాదారులను బెదిరించి భయాందోళనలకు గురిచేశారు. ఎవరూ ఫోన్ కాల్స్ చేయకుండా ఉండేందుకు అందరి మొబైల్ ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు.
తుపాకుల నీడలో సిబ్బందిని లొంగదీసుకున్న దొండగులు, సుమారు రూ.50 లక్షల పైగా నగదును దోచుకొని అక్కడి నుండి పరారయ్యారు. నిత్యం రద్దీగా ఉండే వరాచా వంటి ప్రాంతంలో, అందరూ చూస్తుండగానే ఇంతటి సాహసోపేతమైన దోపిడీ జరగడం భద్రతా వైఫల్యాలను ఎత్తిచూపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: కిషన్ బాగ్లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ వర్క్షాప్ దగ్ధం
పట్టపగలే తుపాకులతో బెదిరించి బ్యాంకులో రూ.50 లక్షలు చోరీ
సూరత్లోని వరాచా ప్రాంతంలోని SBI శాఖలో దొంగల బీభత్సం
ముందుగా అలారం వ్యవస్థను నిర్వీర్యం చేసిన దుండగులు
అనంతరం ఇతరులకు సమాచారం ఇవ్వకుండా ఫోన్లను లాక్కొని మరీ దొంగతనం
₹50 Lakhs Stolen from Bank at Broad Daylight After… pic.twitter.com/2NitppfcMo
— BIG TV Breaking News (@bigtvtelugu) April 28, 2026