E-Paper
Advertisement

RTC బస్సు- లారీ ఢీ.. 15మందికి తీవ్రగాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

RTC బస్సు- లారీ ఢీ.. 15మందికి తీవ్రగాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
Advertisement

Medak RTC bus accident: మెదక్ జిల్లా కొల్చారం మండల పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి మెదక్ వైపు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న ధాన్యం లారీని ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఈ ఘటన జరిగింది. అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. బస్సు లారీని బలంగా ఢీకొట్టడంతో ప్రయాణికుల్లో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. క్షతగాత్రులను వెంటనే స్థానికులు, పోలీసులు మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. జాతీయ రహదారిపై ధాన్యం లారీలను ఓవర్‌టేక్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Read Also: కిషన్ బాగ్‌లో భారీ అగ్నిప్రమాదం.. సోఫా తయారీ వర్క్‌షాప్‌ దగ్ధం

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×