Bus Accident: వరుస బస్సు ప్రమాదాలతో ప్రజల్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిత్యం ఏదోక ప్రదేశంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ప్రైవేట్ బస్సులు ఎదురెదురుగా ఢీకొని అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ముప్పైకి పైగా ప్రయాణికులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళ్తే.. కడయనల్లూరు సమీపంలోని ఇడైక్కల్ దురైసామిపురం వద్ద రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఢీకొన్న ప్రభావంతో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Also Read: కూలీలు వెళ్తున్న టాటా ఏసీ వాహనం బోల్తా.. స్పాట్లో 20 మంది
దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మధురై నుంచి సెంకోట్టై మార్గంలో వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో బయటపడింది. కలెక్టర్ కమల్ కిషోర్, ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన వారిని టెన్కాశీ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
தனியார் பேருந்துகள் நேருக்கு நேர் மோதி விபத்து
தென்காசி மாவட்டம் இடைகால் அருகே 2 தனியார் பேருந்துகள் நேருக்கு நேர் மோதிய விபத்தில் 6 பேர் உயிரிழப்பு
காயமடைந்தவர்கள் மீட்கப்பட்டு மருத்துவமனையில் சிகிச்சைக்காக அனுமதி. #Tenkasi #Accident #Bus pic.twitter.com/3zXZV0sEFJ
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) November 24, 2025