Ramagundam: తెలంగాణలో 8 మంది మావోయిస్టులు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట శనివారం 8 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారు. ఈ సందర్భంగా పోలీసు కమిషనర్ మాట్లాడుతూ.. మిగిలిన మావోయిస్టులు కూడా ఆయుధాలు వదిలి జనజీవన స్రవంతిలో కలవాలని కోరారు. లొంగిపోయిన వారికి పునరావాస పథకం కింద అనేక ప్రయోజనాలను అందిస్తామని చెప్పారు.
జార్ఖండ్ లో మావోయిస్టులకు ఇటీవల గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు. మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై ఐజీ మైఖేల్ రాజ్ మాట్లాడుతూ… అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి మావోయిస్టులు ఎదురుపడి.. పోలీసులపైకి కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు ఎదురుకాల్పులకు దిగడంతో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
Also Read: మావోయిస్ట్ పార్టీకి బిగ్ షాక్.. మరో 52 మంది సరెండర్